సాగు చట్టాలపై ఢిల్లీలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్లో విపక్ష సభ్యులు కేంద్రాన్ని నిలదీస్తున్నారు. మరోవైపు విదేశీ ప్రముఖులు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. సాగు చట్టాల్లో సవరణలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని.. అంతమాత్రాన అందులో లోపాలు ఉన్నట్లు భావించకూడదని అన్నారు. వ్యవసాయ చట్టాలపై కొందరు ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంగా నేడు నరేంద్ర సింగ్ తోమర్ రాజ్యసభలో మాట్లాడారు.
''రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే మా లక్ష్యం. జీడీపీ వృద్ధిలో వ్యవసాయ రంగం పాత్ర పెరుగుతోంది. ఆ దిశగానే కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చాం. రైతుల సంక్షేమానికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని మరోసారి చెబుతున్నా. కొన్ని రైతు సంఘాలు, విపక్షాలు సాగు చట్టాలను నల్లచట్టాలుగా పేర్కొంటున్నాయి. అందులో నలుపు ఏముందని నేను అడుగుతున్నా. వాళ్లు చెబితే మేం సరిచేస్తాం. చట్టాల్లో ఎక్కడా పొరపాట్లు లేవు. కానీ రైతుల ఆందోళనల్లోనే పొరపాట్లు కనిపిస్తున్నాయి.'' అని నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు.
Our efforts are that farmers' incomes are doubled & contribution of agriculture to GDP increases rapidly. These agriculture laws are also an important step in this direction. I want to tell his House & farmers that PM Modi is committed towards welfare of farmers: Union Agri Min pic.twitter.com/hDknerfCJ0
— ANI (@ANI) February 5, 2021
''కొత్త చట్టాలు అమలైతే మీ భూములు లాక్కుంటారంటూ కొందరు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. వారిని కావాలనే రెచ్చగొడుతున్నారు. ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి చెందిన రైతులను రెచ్చగొడుతున్నారు. ఒప్పంద వ్యవసాయ చట్టం ద్వారా రైతుల భూములు దోపిడీకి గురవుతాయని చెప్పేలా ఒక్క నిబంధన అయినా చట్టంలో ఉందా? చూపించండి. ''అని నరేంద్ర సింత్ తోమర్ తెలిపారు.
Farmers are being misled that others would occupy their land if these laws are implemented. Let me know if there is a single provision in Contract Farming law which allows any trader to snatch away the land of any farmer: Union Agriculture Minister NS Tomar
— ANI (@ANI) February 5, 2021
;
పంటలకు ఉత్పత్తి ఖర్చుల కంటే కనీసం 50 శాతం ఎక్కువగా కనీస మద్దతు ధర కల్పిస్తున్నామని నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. ఆత్మనిర్భర్ ప్యాకేజీ కింద వ్యవసాయ మౌలిక అవసరాల కోసం రూ.లక్ష కోట్ల నిధులు కేటాయించామని అన్నారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడుల పెరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన వెల్లడించారు. పండ్లు, కూరగాయాలను రైళ్లలో తరలిస్తామని ఎప్పుడైనా అనుకున్నామా... అందుకోసం 100 కిసాన్ రైళ్లు నడుస్తున్నాయని వ్యవసాయమంత్రి తెలిపారు.
We have started to provide MSP, 50% more than the production cost. Also, Rs 1 lakh crore agriculture infrastructure fund has been given under Atmanirbhar package. We have tried to ensure the requisite investment reaches the agriculture sector: Agriculture Minister NS Tomar pic.twitter.com/Dgq2JdUKNr
— ANI (@ANI) February 5, 2021
మరోవైపు ఢిల్లీలో శివార్లలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. 11 దఫాలు చర్చలు జరిపినా.. స్పందించడం లేదని రైతులు సంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 6న దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. అన్ని చోట్ల రాస్తారోకోలు చేపడతామని స్పష్టం చేశారు. ఐతే జనవరి 16న ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు ఈసారి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Delhi, Farmers Protest, Indian parliament, New Agriculture Acts, Rajyasabha