హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Agni V Missiles: అగ్ని-5 మిస్సైల్ ప్రయోగం సక్సెస్..చైనాకు చెక్!

Agni V Missiles: అగ్ని-5 మిస్సైల్ ప్రయోగం సక్సెస్..చైనాకు చెక్!

అగ్ని-5

అగ్ని-5

అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని భారత్ గురువారం రాత్రి ప్రయోగించి సక్సెస్ అయింది. అణ్వాయుధాలను ప్రయోగించగల సామర్ధ్యం ఉన్న ఈ బాలిస్టిక్ మిస్సైల్ పరిధి 5000 కిలోమీటర్లు. అయితే ఈ 5 వేల కిలోమీటర్ల దూరాన్ని మించి కూడా లక్ష్యాన్ని ఛేదించగల సామర్ధ్యం అగ్ని-5 సొంతం. దీనితో చైనాకు చెక్ పెట్టేనా?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని భారత్ గురువారం రాత్రి ప్రయోగించి సక్సెస్ అయింది. అణ్వాయుధాలను ప్రయోగించగల సామర్ధ్యం ఉన్న ఈ బాలిస్టిక్ మిస్సైల్ పరిధి 5000 కిలోమీటర్లు. అయితే ఈ 5 వేల కిలోమీటర్ల దూరాన్ని మించి కూడా లక్ష్యాన్ని ఛేదించగల సామర్ధ్యం అగ్ని-5 సొంతం. అరుణాచల్ ప్రదేశ్ లో తవాంగ్ సరిహద్దుల్లో చైనా-భారత్ జవాన్ల మధ్య ఘర్షణ తరువాత కొన్ని రోజులకే బీజింగ్ పై కూడా దాడి చేయగల సామర్ధ్యం ఉన్న అగ్ని-5ను భారత్ విజవంతంగా పరీక్షించడంతో మరో అడుగు ముందుకేసింది. ఈ ప్రయోగానికి ముందు బంగాళాఖాతం ప్రాంతాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించారు.

Covid-19: వాసన, రుచి కోల్పోవడం కాదు.. కరోనాకు ఇది అత్యంత సాధారణ లక్షణం.. అదేంటంటే..

India successfully carries out night trials of over 5,000 Km range Agni-5 ballistic missile

Read @ANI Story | https://t.co/jaEbuVlR9v#agni5 #ballisticmissile #India pic.twitter.com/JZiz3XbuA4

— ANI Digital (@ani_digital) December 15, 2022

Nirav Modi: నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు లైన్ క్లియర్.. ఇంకా ఆలస్యం జరగొచ్చా ?

రక్షణ వ్యవస్థలో ఇండియా ముందడుగు..

అగ్ని-5 క్షిపణి ప్రయోగం సక్సెస్ కావడంతో భారత్ రక్షణ వ్యవస్థలో మరో కీలక ముందడుగు వేసింది. ఓడిశాలోని చందీపూర్ లో ఈ క్షిపణిని ప్రయోగించారు. అగ్ని-5 క్షిపణిని అత్యాధునిక సాంకేతికతతో, తక్కువ బరువుతో రూపొందించారు. అయితే అణ్వాయుధం సామర్ధ్యం కలిగిన అగ్ని-5 క్షిపణిపై చైనా ఇప్పటికే పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం..సీబీఐ తొలి ఛార్జ్ షీట్ పై కోర్టు ఏం చెప్పిందంటే..

అబ్దుల్ కలాం కలల ప్రాజెక్ట్

అగ్ని-5ను ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ కింద అభివృద్ధి చేశారు. ఈ IGMDP మాజీ రాష్ట్రపత్రి అబ్దుల్ కలాం కలల ప్రాజెక్ట్. మిస్సైల్ టెక్నాలజీలో భారత్ స్వయం సమృద్ధం కావాలనే లక్ష్యంతో దీనిని ప్రారంభించారు. ఇక అగ్ని-5 దేశీయంగా రూపొందిన, భూమిపై నుంచి భూమిపైకి ప్రయోగించే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. అయితే ఇప్పటికే ఐదు క్షిపణులను అభివృద్ధి చేశారు. అవి పృథ్వీ, అగ్ని, త్రిశూల్, నాగ్, ఆకాష్.

అగ్ని-6పై ఫోకస్..

ఇక ప్రస్తుతం భారత్ అగ్ని-6పై పని చేస్తుంది. ఇది జలాంతర్గాముల నుండి భూమి నుండి ప్రయోగించగలదు. సుమారు 8 వేల నుండి 10 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేధించగలదు. గత రెండు దశాబ్దాలలో అగ్ని-1, అగ్ని-2, అగ్ని-3, అగ్ని-4, అగ్ని- 5 క్షిపణులను అభివృద్ధి చేసింది. అంతేకాదు వీటన్నింటిని విజయవంతంగా ప్రయోగించింది. ఇక DRDO 2021లో కొత్త తరం అణు సామర్ధ్యం గల బాలిస్టిక్ క్షిపణి అగ్ని పీని విజయవంతముగా పరీక్షించింది.

First published:

Tags: China, India, India-China

ఉత్తమ కథలు