మొన్న ఉల్లి, నిన్న టమాట.. నెక్ట్స్ ధరలు పెరిగే సరుకులు ఇవే..
సరుకు నిల్వల మీద ప్రభుత్వం గట్టి నిఘా పెట్టడం, నిబంధనలు అమలు చేయడంతో ఒక్క రోజు కొంచెం ధరలు తగ్గినా...మళ్లీ యధావిధిగా పెరుగుదల నమోదవుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
news18-telugu
Updated: October 3, 2019, 5:41 PM IST

పెరుగుతున్న ఉల్లి, టమాట ధరలు
- News18 Telugu
- Last Updated: October 3, 2019, 5:41 PM IST
ఉల్లి ధరలు ఇంకా తగ్గలేదు. కేజీ రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతున్నాయి. మరోవైపు టమాట ధరలు పరుగులు పెడుతున్నాయి. దీంతో జనం గగ్గోలు పెడుతున్నారు. అయితే, ఈ ధరల మంట ఇంతటితో ఆగదు. పండుగ సీజన్లో పిండివంటలు వండాలనుకునే వారికి భారీ షాక్ తగలనుంది. ఉల్లి, టమాట తర్వాత పప్పు ధరలు ఆకాశాన్ని అంటబోతున్నాయి. కొన్ని రోజులుగా అమాంతం పెరుగుతున్న ధరలే అందుకు సాక్ష్యం. గత వారం రోజుల్లో దేశంలోని దాదాపు అన్ని మార్కెట్లలోనే క్వింటా మినప్పప్పు ధర రూ.450 నుంచి అమాంతం పెరిగిపోయి రూ.850కి చేరింది. అది అక్కడితో ఆగే సీన్ కనిపించడం లేదు. మినప్పప్పుతో పాటు పెసరపప్పు, ఎర్రపప్పు, శనగలు రేట్లు కూడా పెరిగిపోతున్నాయి.
మధ్యప్రదేశ్లో ఇటీవల 40 రోజుల పాటు నాన్స్టాప్గా కురిసిన భారీ వర్షాలతో పప్పు దినుసుల పంటలు నీట మునిగాయి. గత ఏడాది ఖరీఫ్ సీజన్తో పోలిస్తే ఈ ఏడాది చాలా తక్కువ పప్పు దినుసుల దిగుబడి నమోదైంది. అయితే, సరుకు నిల్వల మీద ప్రభుత్వం గట్టి నిఘా పెట్టడం, నిబంధనలు అమలు చేయడంతో ఒక్క రోజు కొంచెం ధరలు తగ్గినా...మళ్లీ యధావిధిగా పెరుగుదల నమోదవుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముంబైలో మంగళవారం క్వింటా మినప్పప్పు ధర రూ. 5450 (గత వారంతో పోలిస్తే రూ.550 అధికం). ఢిల్లీలో రూ.450, చెన్నైలో రూ.600, కోల్కతాలో రూ.800 వరకు ధరలు పెరిగాయి. పెసరపప్పు కూడా వివిధ నగరాల్లో కనీసం రూ.100 నుంచి రూ.200 వరకు పెరిగాయి.
మధ్యప్రదేశ్లో ఇటీవల 40 రోజుల పాటు నాన్స్టాప్గా కురిసిన భారీ వర్షాలతో పప్పు దినుసుల పంటలు నీట మునిగాయి. గత ఏడాది ఖరీఫ్ సీజన్తో పోలిస్తే ఈ ఏడాది చాలా తక్కువ పప్పు దినుసుల దిగుబడి నమోదైంది. అయితే, సరుకు నిల్వల మీద ప్రభుత్వం గట్టి నిఘా పెట్టడం, నిబంధనలు అమలు చేయడంతో ఒక్క రోజు కొంచెం ధరలు తగ్గినా...మళ్లీ యధావిధిగా పెరుగుదల నమోదవుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముంబైలో మంగళవారం క్వింటా మినప్పప్పు ధర రూ. 5450 (గత వారంతో పోలిస్తే రూ.550 అధికం). ఢిల్లీలో రూ.450, చెన్నైలో రూ.600, కోల్కతాలో రూ.800 వరకు ధరలు పెరిగాయి. పెసరపప్పు కూడా వివిధ నగరాల్లో కనీసం రూ.100 నుంచి రూ.200 వరకు పెరిగాయి.
ఉల్లి ధర తగ్గించడానికి రష్మీ గౌతమ్ జబర్దస్త్ చిట్కా
స్మార్ట్ ఫోన్ కొంటే కేజీ ఉల్లి ఫ్రీ... ప్లాన్ వర్కవుట్ అయిందిగా...
ఉల్లిపాయలు మాంసాహారమా..? కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై దుమారం
ఉల్లి కోసం జనాల ప్రాణాలు తీస్తారా.. సీఎం జగన్పై లోకేష్ ఫైర్
ఉల్లి ధర కేజీ రూ.500 అయినా ఆ గ్రామస్తులకి డోంట్ కేర్...
Video : పెరిగిన ఉల్లి ధరలపై వ్యాపారులు ఏమంటున్నారు..
Loading...