మధ్యప్రదేశ్లో (Madhya Pradesh Road Accident) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రేవా జిల్లాలోని కొండ ప్రాంతంలో ట్రక్కును ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Bus Truck Collision) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 40 మందికి గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని సమాచారం. శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో.. సోహగి ఘాట్ రోడ్డులో ఈ దుర్ఘటన (Rewa Bus Accdent) చోటు చేసుకుంది. ఈ బస్సు హైదరాబాద్ (Hyderabad)లోని సికింద్రాబాద్ నుంచి యూపీకి వెళ్తున్నట్లు తెలిసింది.
MP | 14 dead, 40 injured in a collision b/w a bus & trolley near Suhagi Pahari in Rewa. Of the 40 injured, 20 admitted to a hospital in Prayagraj (UP). Bus was going from Hyderabad to Gorakhpur. All people on the bus are reportedly the residents of UP: Navneet Bhasin, SP Rewa pic.twitter.com/z7M8AhKJWJ
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 22, 2022
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సోహగి కొండపై మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. మొదట ట్రక్కును ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. అదే సమయంలో వెనక నుంచి వస్తున్న బస్సు అదుపు తప్పి.. ట్రక్కును బలంగా ఢీకొట్టింది. అతి వేగంగా ట్రక్కు మీదకు దూసుకెళ్లడంతో.. బస్సు ముందుకు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ముందు భాగంలో కూర్చున్న ప్రయాణికులంతా స్పాట్లోనే మరణించారు. సోహగి పోలీస్ స్టేషన్కు 500 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరగడంతో.. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో నుంచి మృతదేహాలను బయటకు తీసి.. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.
A horrific road #accident in MP's #Rewa.. Here three vehicles collided one after the other. 14 people died in the collision between the bus and the truck. #Laborers from #Bihar and Uttar Pradesh among those who died. #accidente pic.twitter.com/GnpSS7LcJ9
— Rahul Deo Kumar (@RahulDeoKumar) October 22, 2022
మృతుల్లో ఇద్దరు డ్రైవర్లు, ఓ అసిస్టెంట్తో పాటు 11 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి గురైన బస్సు హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్లోని కట్నీకి, అక్కడి నుంచి యూపీలోని లోక్నోకు వెళ్తోందని ప్రయాణికులు తెలిపారు. మృతులను యూపీ, బీహార్ , నేపాల్కు చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు. వీరు హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తారని తెలిపారు. దీపావళి పండగ కోసం హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. రెండంతస్తుల బస్సులో దాదాపు 100 మంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొన్నారు. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతిందని... ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్ పారిపోయాడని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Madhya pradesh, Road accident