హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Mann Ki Baat : కరోనాతో జాగ్రత్త.. 99వ మన్ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

Mann Ki Baat : కరోనాతో జాగ్రత్త.. 99వ మన్ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

ప్రధాని నరేంద్ర మోదీ (Image credit - PTI)

ప్రధాని నరేంద్ర మోదీ (Image credit - PTI)

99th Mann ki baat : కరోనాపై అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తన 99వ మన్ కీ బాత్‌ ప్రసంగంలో కోరారు. ఏప్రిల్ 30న ఆయన చేయబోయే మన్ కీ బాత్ ప్రసంగం వందో ఎపిసోడ్ కానుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

99th Mann ki baat : కరోనాపై అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తన 99వ మన్ కీ బాత్‌ ప్రసంగంలో కోరారు.

ఇండియాలో 5 వారాలుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అలాగే.. త్వరలో చాలా పండుగలు కూడా రాబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇదే అంశాన్ని ప్రధాని మోదీ .. ఇవాళ తన 99వ మన్ కీ బాత్ ప్రసంగంలో తెలిపారు.

రకరకాల పండుగలు వస్తున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని అన్ని మతాల వారికీ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ సజా చాలా పండుగలు వస్తున్న సమయంలో.. ఈ కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు కరోనాను తక్కువ అంచనా వేయవద్దనీ, ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని మోదీ కోరారు. "పండుగలు ఉత్సాహంగా జరుపుకోండి.. కానీ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి" అని మోదీ కోరారు.

ఇండియాలో నిన్న కొత్తగా 1,890 కరోనా కేసులు నమోదయ్యాయి. 149 రోజుల్లో ఇవే అత్యధికం. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య 9,433కి చేరింది అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. నిన్న కొత్తగా ఏడుగురు చనిపోవడంతో.. మొత్తం మరణాల సంఖ్య 5,30,831కి చేరింది. ఇప్పటివరకూ 220.65 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేసినట్లు వివరించింది.

ఈ ఎపిసోడ్ 99వది కావడం ప్రత్యేకం అనుకోవచ్చు. వచ్చే ఏప్రిల్ చివరి ఆదివారం ఆయన 100వ మన్ కీ బాత్ రేడియో ప్రసంగం చేయనున్నారు. మోదీ మొదటిసారి.. 2014 అక్టోబర్ 3న తొలి మన్ కీ బాత్ ప్రసంగం చేశారు. అప్పటి నుంచి కంటిన్యూగా ప్రతీ నెలా ఓ ఎపిసోడ్ చేస్తున్నారు. ఇప్పుడు విజయవంతంగా 99 ఎపిసోడ్లు పూర్తయ్యాయి.

First published:

Tags: Mann Ki Baat, Narendra modi

ఉత్తమ కథలు