న్యాయం ఆలస్యమవడం కూడా అన్యాయమే అన్నది చాలామంది వాదన. భారత్లో పరిస్థితి ఇందుకు సరిగ్గా సరిపోతుంది. అందుకే న్యాయ వ్యవస్థపై జోకులు వేసే పరిస్థితి కూడా వచ్చింది. కోర్టు కేసులో ఓడిన వాడు కోర్టులోనే ఏడిస్తే.. గెలిచనవాడు ఇంటికొచ్చి ఏడుస్తాడన్న జోకులు పుట్టుకొచ్చాయి. దేశంలోని కోర్టుల్లో కోట్లకొద్ది కేసులు పెండింగ్లో ఉండటమే ఈ పరిస్థితికి కారణమైంది. చాలా కేసుల్లో న్యాయం ఆలస్యమవుతుండటంతో.. అది దోషులకు వరంగా, బాధితులకు శాపంగా మారుతోంది. కోర్టు మెట్లెక్కితే ఏళ్లు గడిచినా వ్యవహారం ఎటూ తేలదు అన్న అభిప్రాయం సామాన్య జనంలో నాటుకుపోయింది.
దేశంలో జనాభా నిష్పత్తికి అనుగుణంగా కోర్టులు లేకపోవడమే పెండింగ్ కేసులకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అలాగే కేసుల సంఖ్యకు, దేశంలో ఉన్న న్యాయవాదులు, న్యాయమూర్తుల సంఖ్యకు ఏమాత్రం పొంతన లేకపోవడం,న్యాయమూర్తుల నియామకంలో జాప్యం వల్ల.. ఉన్న న్యాయమూర్తుల పైనే పనిభారం పెరగడం కూడా పెండింగ్ కేసులు గుట్టలా పేరుకుపోవడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. న్యాయమూర్తులను, ప్రధాన న్యాయమూర్తిని నియమించాలని న్యాయవాదులే రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం దేశంలో నెలకొంది. ఇప్పటికైనా న్యాయ వ్యవస్థలో నియామకాలను స్పీడప్ చేయకపోతే దేశంలో సత్వర న్యాయం కూడా ఓ కలగానే మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు.
Pending court cases in #India
— Kanchan Gupta (@KanchanGupta) January 28, 2019
Supreme Court 57,346
High Courts 47,19,483
Lower courts 2,96,93,988
Total pending 3,44,70,817
[As on 28.01.19.] #Judiciary #Justice #ConstitutionalMorality
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi High Court, High Court, Supreme Court