హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

omicron: వణికిస్తున్న ఒమిక్రాన్​.. భారత్​లో ఒక్కరోజే 16 కేసులు.. ఆ రాష్ట్రంలోనే సగానికి పైగా ఒమిక్రాన్​ కేసులు 

omicron: వణికిస్తున్న ఒమిక్రాన్​.. భారత్​లో ఒక్కరోజే 16 కేసులు.. ఆ రాష్ట్రంలోనే సగానికి పైగా ఒమిక్రాన్​ కేసులు 

కరోనాతో చిత్తూరులో ఒకరు చనిపోవడంతో మొత్తం మరణాలు 14,708కి చేరుకున్నాయి. కాగా, అమరావతి సచివాలయంలో కొవిడ్‌ ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు సీఎస్‌ సమీర్‌శర్మ అన్ని శాఖలకు ఆదేశాలు జారీచేశారు.

కరోనాతో చిత్తూరులో ఒకరు చనిపోవడంతో మొత్తం మరణాలు 14,708కి చేరుకున్నాయి. కాగా, అమరావతి సచివాలయంలో కొవిడ్‌ ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు సీఎస్‌ సమీర్‌శర్మ అన్ని శాఖలకు ఆదేశాలు జారీచేశారు.

ఒమిక్రాన్​ వేరియంట్​ డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని ( six times higher potential to spread ) శాస్త్రవేత్తలు తెలియజేయడం ఆందోళన కలిగిస్తోంది. భారత్​లో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది

దక్షిణాఫ్రికా (South Africa)లో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్​ ఒమిక్రాన్ (Omicron variant) రూపాంతరం చెంది పలు దేశాలను కలవరపెడుతోంది. ఒమిక్రాన్ ట్రాన్స్మిసిబిలిటీని వ్యాక్సిన్‌లు ఏమాత్రం తట్టుకుంటాయో ప్రస్తుతానికైతే తెలియదు. ఈ నెల ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్.. ఇప్పటికే ఆ దేశాన్ని గడగడలాడిస్తోంది. అయితే ఈ కేసులు పలు దేశాల్లోనూ గుర్తించడంతో ప్రపంచదేశాలకు వణుకు మొదలైంది. గతంలో వచ్చిన అన్ని కరోనా వైరస్​ల కంటే సెకండ్​ వేవ్​లో భారత్​లో అల్లకల్లోలం సృష్టించిన డెల్టా రకం (delta variant) అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ (Omicron)​ వైరస్​పై పరిశోధనలు మొదలుపెట్టారు. అయితే ఈ ఒమిక్రాన్​ వేరియంట్​ డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని ( six times higher potential to spread ) శాస్త్రవేత్తలు తెలియజేయడం ఆందోళన కలిగిస్తోంది. అయితే భారత్​లో ఒమిక్రాన్ (Omicron)​ వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

తాజాగా ఒక్క మహారాష్ట్రలోనే ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఈ ఉదయం ఢిల్లీలో 4, రాజస్తాన్‌లో 4 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ఒక్కరోజే దేశంలో 16 ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూశాయి. కాగా, ఎనిమిది కేసుల్లో 7 మంది ముంబైకి చెందినవారు.  ఒకరు వసాయి విరార్‌కు చెందినవ్యక్తి. ఇప్పటి వరకు, మహారాష్ట్ర (Maharashtra)లో మొత్తం 28 మంది ఓమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. వీరిలో 9 మంది RT-PCR పరీక్షలో నెగిటివ్‌గా వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయ్యారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల (Omicron cases)​ సంఖ్య 57కు చేరింది. ఇప్పటివరకు 6 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.

ఈ కొత్త రకం వేరియంట్‌తో అప్రమత్తంగా ఉండాలని ఆగ్నేయాసియా దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) హెచ్చ‌రించింది. ఈ దేశాలు క‌రోనా వైర‌స్ వ్యాప్తిపై నిఘా పెంచాలని, వ్యాప్తి అడ్డుకొట్ట‌కు త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు చేప‌డితే మంచిద‌ని ఆగ్నేయాసియా ప్రాంత డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ సూచించారు. అయితే ఈ ఒమిక్రాన్​ వేరియంట్​ డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని ( six times higher potential to spread ) శాస్త్రవేత్తలు తెలియజేయడం ఆందోళన కలిగిస్తోంది.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Corona cases, Omicron

ఉత్తమ కథలు