ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. బాహుబలి తర్వాత ఈయన వరస సినిమాలు చేస్తున్నాడు కానీ వాటి విడుదల తేదీలపై మాత్రం క్లారిటీ రావడం లేదు. అయితే ఇప్పుడు రెండు సినిమాలపై ఒకేసారి క్లారిటీ ఇచ్చేసాడు ఈ హీరో. సుజీత్ దర్శకత్వంలో నటిస్తున్న ‘సాహో’ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుందని ఇదివరకే ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది.
ప్రభాస్, నీల్ నితిన్ ముఖేష్లపై ముంబైలోని బాంద్రా బ్రిడ్జ్ మీద ఓ భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేసాడు దర్శకుడు సుజీత్. అయితే అక్కడ పర్మిషన్ రాలేదు.. అనుమతి నిరాకరించడంతో ఇప్పుడు ఇదే సెట్ ఆర్ఎఫ్సీలో నిర్మిస్తున్నారని తెలుస్తుంది. ఇక్కడే ఈ షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు సుజీత్. దీనికోసం 20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు రాధాకృష్ణ కుమార్ సినిమాను కూడా ఇదే ఏడాది విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ కూడా దాదాపు 30 శాతం పూర్తైపోయింది. రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని 1960ల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. ఇటలీ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. ఈ సినిమాను కూడా డిసెంబర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. పైగా రెండు సినిమాలకు యువీ క్రియేషన్స్ నిర్మాతలు కావడంతో పని ఇంకా ఈజీ అయిపోయింది. ఈ రెండు సినిమాలు ఆర్నెళ్ల గ్యాప్ లో వస్తే అభిమానులకు కూడా పండగే కదా..!
ఇప్పుడు ప్రభాస్ ఇదే చేయాలనుకుంటున్నాడు. ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని బాహుబలి అయిపోయిన తర్వాత మాటిచ్చాడు ప్రభాస్. అయితే ఈ మాట నిలబెట్టుకోలేకపోయాడు ఈయన. ఇప్పుడు అది పూర్తి చేయాలని చూస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్. అన్నీ కుదిర్తే ఆగస్ట్ 15న సాహోకు స్వాతంత్ర్యం ఇచ్చి.. డిసెంబర్లో రాధాకృష్ణ కుమార్ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. మరి ఇది సాధ్యమవుతుందో లేదో చూడాలిక.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Prabhas, Shraddha Kapoor, Telugu Cinema, Tollywood