news18-telugu
Updated: January 14, 2020, 2:42 PM IST
వెంకటేష్ (File Photo)
గతేడాది మొదట్లో ‘ఎఫ్ 2’ వంటి సక్సెస్ఫుల్ మూవీతో బోణి చేసిన వెంకటేష్.. ఇయర్ ఎండింగ్లో మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ సినిమాతో సక్సెస్తో మంచి ముగింపు పలికాడు. ఈ యేడాది మాత్రం.. తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన సూపర్ హిట్ ‘అసురన్’ రీమేక్ను పట్టాలెక్కించేపనిలో ఉన్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కలైపులి ఎస్.థానుతో కలిసి సురేష్ బాబు ఈ రీమేక్ను తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరగుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి కొబ్బరికాయ కొట్టి సెట్స్ పైకి తీసుకెళ్లడమే తరువాయి. ఇక ఈ చిత్రంలో వెంకటేష్ సరసన జాతీయ ఉత్తమ నటి ప్రియమణి నటించనుంది. తమిళంలో ధనుశ్ ద్విపాత్రాభినయం చేసిన వెంకటేష్... ఈ చిత్రంలో మరో పాత్రకోసం మరో యువ నటుడిని అనుకుంటున్నారు.

వెంకటేష్,ప్రియమణి (Twitter/Photo)
పక్కా పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని రాయలసీమలోని అనంతపురంలో ఈ సినిమా మేజర్ పార్ట్ను చిత్రీకరించనున్నారు. అక్కడ దాదాపు 30 రోజుల పాటు షూటింగ్ జరిగే అవకాశం ఉంది. దాదాపు రెండు నెలల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి 2020 సమ్మర్లో విడుదల చేయాలనే ప్లాన్లో ఉన్నారు.

వెంకటేష్ ధనుష్ అసురన్
‘అసురున్’ చిత్ర విషయానికొస్తే.. కుల వ్యవస్థ దాని మూలంగా జరిగిన గొడవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. తమిళ నేటివిటీకి ఈ కథ సరిగ్గా సరిపోయింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో హీరో.. ఊర్లో వాళ్ల కాళ్లు మొక్కడం.. ఆవు పేడ వేస్తే ధనుశ్ చేత్తో ఎత్తడం వంటి రియలిస్టిక్ సన్నివేశాలున్నాయి. తమిళ హీరోలు.. ప్రేక్షకులను అభిమానులను కాకుండా.. కథకున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఆయా సన్నివేశాల్లో నటించడం ఎప్పటి నుంచో ఉంది. మరి తెలుగు ప్రేక్షకులు ఇటువంటి కథ, కథనం ఉన్న చిత్రాన్ని ఏ మేరకు ఆదరిస్తారనేది చూడాలి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
January 14, 2020, 2:41 PM IST