హోమ్ /వార్తలు /సినిమా /

విడుదలకు సిద్ధంగా 'వీరఖడ్గం'.. డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీ!

విడుదలకు సిద్ధంగా 'వీరఖడ్గం'.. డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీ!

Veera Khadgam (Photo Twitter)

Veera Khadgam (Photo Twitter)

Veera Khadgam: ఎం ఏ చౌదరి దర్శకత్వంలో వివివి ప్రొడక్షన్స్ పతాకంపై కె. కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం 'వీరఖడ్గం'. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని మార్చి మూడో వారంలో ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఎం ఏ చౌదరి దర్శకత్వంలో వివివి ప్రొడక్షన్స్ పతాకంపై కె. కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం 'వీరఖడ్గం' (Veera Khadgam). మారుశెట్టి సునీల్ కుమార్ లైన్ ప్రొడ్యూస‌ర్‌. ఈ సినిమాలో సృష్టి డాంగే హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని మార్చి మూడో వారంలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఈ రోజు ఫిలిం చాంబ‌ర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్ర‌స‌న్న కుమార్ మాట్లాడుతూ..``ద‌ర్శ‌కుడు ఎమ్ ఏ చౌద‌రి ప్ర‌తిభావంతుడు. చాలా కాలంగా తెలుసు. పాట‌లు బావున్నాయి. ఈ సినిమా విజ‌య‌వంత‌మై ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నా`` అన్నారు.

ద‌ర్శ‌కుడు ఎమ్ఏ చౌద‌రి మాట్లాడుతూ..`` చరిత్ర శిథలమైనా, దాని మూలాలు ఎక్కడో ఒక చోట మిగిలే ఉంటాయి. పగ కూడా అంతే. ఒక మనిషిని నాశనం చెయ్యాలి అనుకుంటే ఎన్ని జన్మలైనా సరే దాన్ని సాధించే వరకు మనిషి జీవితం మసి అయినా, ఆ శవమే మృగమై వెంటాడుతుంది. వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ఈ వీరఖడ్గం. గ్రాఫిక్స్ కి ప్రాధాన్య‌త ఉన్న చిత్ర‌మిది. నిర్మాత కోటేశ్వ‌ర‌రావు , లైన్ ప్రొడ్యూస‌ర్ సునీల్ కుమార్ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. షాయ‌క్ ప‌ర్వేజ్ మంచి సంగీతాన్ని స‌మ‌కూర్చాడు. మార్చి మూడో వారంలో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

లైన్ ప్రొడ్యూస‌ర్ మారుశెట్టి సునీల్ కుమార్ మాట్లాడుతూ..``నిర్మాతగా నేను గ‌తంలో `రెండో కృష్ణుడు` అనే సినిమా తీశాను. ఆ త‌ర్వాత ఎమ్ఏ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `ఇంద్రాణి, చిలిపికృష్ణుడు చిత్రాల‌కు ఫైనాన్సియ‌ర్ గా చేశాను. క‌థ న‌చ్చి `వీర‌ఖ‌డ్గం` చిత్రానికి లైన్ ప్రొడ్యూస‌ర్ గా చేశాను. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ప్రేక్ష‌కులు మాచిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా``అన్నారు.

తెలంగాణ ఫిలించాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఛైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ...``సినిమా చూశాను. మంచి గ్రాఫిక్స్ తో చాలా గ్రాండ్ గా తీశారు. పాట‌లు కూడా బావున్నాయి. లొకేష‌న్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ సాధించి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మంచి పేరు తీసుక‌రావాల‌న్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు షాయ‌క్ ప‌ర్వేజ్ మాట్లాడుతూ..``ఇందులో నాలుగు పాట‌లున్నాయి. సునీత, లలిత సాగ‌రి, సాహితి, రామ‌కృష్ణ పాట‌లు పాడారు. ద‌ర్శ‌కుడు చౌద‌రి గారు నాతో క్వాలిటీ వ‌ర్క్ చేయించుకున్నారు. 300 ఏళ్ల క్రితం పార్వ‌తిపురంలో జ‌రిగిన ఓ య‌థార్థ సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. మ్యూజిక్ కి స్కోపున్న సినిమా `` అన్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, సత్యప్రకాష్ , ఆనంద్ రాజ్, మదన్, తపస్వి, అపూర్వ, పృద్విరాజ్, టార్జన్, ధనరాజ్, తాగుబోతు రమేష్, చలపతి రావు తదితరులు నటించిన ఈ చిత్రానికి షాయ‌క్ ప‌ర్వేజ్‌ సంగీతం అందిస్తున్నారు.

First published:

Tags: Cinema, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు