టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభకు ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్కు గురైంది. ఈ దుర్ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా కూడా తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రంభ తన పిల్లలతో పాటు ప్రయాణిస్తున్న కారు మంగళవారం యాక్సిడెంట్కు గురి అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో రంభతో పాటు ఆమె పిల్లలు, వారిని చూసుకునే ఆయా ఉన్నారు.
ఈ విషయాన్ని స్వయంగా రంభనే.. తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పిల్లలను స్కూల్ నుంచి తీసుకు వస్తుంటే ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. అయితే దేవుడి దయ వల్ల ఈ యాక్సిడెంట్లో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని రంభ తెలిపారు. దీంతో ప్రస్తుతం రంభ చేసిన పోస్ట్ వైరలవుతోంది.
Remember Judwaa actress Rambha? Met with an accident is critically injured. Admitted in hospital with her daughter Sasha Actress Rambha Car Meets With Accident On Her Way Back From Kids School #rambha #rambhaindrakumar pic.twitter.com/adUCecM2t7
— Whats In The News (@_whatsinthenews) November 1, 2022
ఇంటర్ సెక్షన్ దగ్గర తమ కారును మరో కారు ఢీ కొట్టింది. అప్పుడు కారులో తనతో పాటు పిల్లలు, ఆయా ఉన్నారని పోస్టులో వెల్లడించారు రంభ. దయ వల్ల ఈ ప్రమాదంలో మేం చిన్న చిన్న గాయాలతో బయటపడ్డామన్నారు. మేం అందరం సురక్షితంగా ఉన్నామన్నారు. కాకపోతే తన చిన్నారి సాషా దేవుడి ఇంకా ఆసుపత్రిలోనే ఉందన్నారు. టైమ్ అస్సలు బాగాలేదని ఆవేదన వ్యక్తంచేసింది.. దయచేసి మా కోసం దేవుడిని ప్రార్థించండి అంటూ రంభ పేర్కొన్నారు. చిన్నారి సాషా త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని అభిమానుల్ని ఆమె కోరారు. ఈ సమయంలో మీ ప్రార్థనలు మాకు ఎంతో అవసరం అని రంభ తన పోస్టులో వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Car accident, Telugu Actress