దేశ వ్యాప్తంగా కరోనా లాక్డౌన్ కారనంగా అన్ని వ్యవస్థలు స్థంభించి పోయిన సంగతి తెలిసిందే కదా. షూటింగ్స్ లేకపోవడంతో పెద్ద పెద్ద హీరోలకు అంతగా ప్రాబ్లెమ్ లేకున్నా.. దానిపై ఆధారపడి జీవిస్తోన్న కార్మికులకు మాత్రం పనులు లేక రోడ్డున పడ్డారు. ఇప్పటికే వీరిని ఆదుకోవడానికి చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసి ఒక విడత సరుకుల పంపిణీ నిర్వహించారు. తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. టాలీవుడ్కు చెందిన 14వ వేల సినీ కార్మికులను ఆదుకోవడానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. మారేడ్ పల్లిలోని మల్టీ పర్పస్ పంక్షన్ హాల్ నుండి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు టీఆర్ఎస్ ముఖ్యనాయకులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖలు పాల్గొన్నారు. ఈ నిత్యావసర సరుకులు కలిగిన కిట్స్ను చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, సి.కళ్యాణ్ చేతుల మీదుగా సినీ కార్మకులను అందజేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.