ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆప్ ఇండియా (ఇఫీ) అవార్డు వేడుకలు గోవాలో ఎంతో ఆడంబరంగా ప్రారంభం అయ్యాయి. ఈ బుధవారం మొదలైన ఈ చిత్రోత్సవం ఈ నెల 28 వరకు జరగనున్నాయి. ఈ సారి ఇఫీ 50వ వేడుకలు జరుపుకోంటోంది. ఈ గెల్డెన్ జూబ్లీ వేడుకల్లో కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్తో ముఖ్యఅథితులుగా పాల్గొన్నారు. మరోవైపు ఈ వేడుకలో బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్,సూపర్ స్టార్ రజినీకాంత్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఈ చిత్రోత్సవంలో రజినీకాంత్కు అమితాబ్ బచ్చన్ చేతులు మీదుగా ‘ఐకాన్ ఆఫ్ ది గోల్డెన్ జూబ్లీ ఆఫ్ ఇఫి’ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. నాకొచ్చిన ఈ అవార్డును తనతో పనిచేసిన దర్శక, నిర్మాతలకు తోటి నటీనటులకు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన రజినీకాంత్.. బస్ కండక్టర్ నుంచి దేశం గర్వపడే స్థాయి నటుడిగా ఎదగడం ఎందరికో స్పూర్తి దాయకం అన్నారు.
ఆయనను నేను తమ కుటుంబ సభ్యుడిగానే భావిస్తాననన్నారు. అంతేకాదు వృత్తిలో ఒకరకొకరం సలహాలు కూడా ఇచ్చిపుచ్చుకుంటామని చెప్పారు. ఏమైనా ఒక వేదికపై ఇద్దరు లెజండరీ నటులను చూసి వేడుకకు వచ్చిన అభిమానులు పులకించిపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amitabh bachchan, Bollywood, Central Government, Goa, Kollywood, Prakash Javadekar, Rajinikanth