తమిళ సినీ ఇండస్ట్రీకి రెండు కళ్ల లాంటి వారైన సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ మరోసారి ఒక సినిమా కోసం కలిసి పనిచేయబోతున్నట్టు కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సంక్రాంతికి రజినీకాంత్ ‘దర్బార్’ సినిమాతో పలకరించాడు.ఈ సినిమా తమిళంలో మంచి కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఈ సినిమా తర్వాత రజినీకాంత్.. శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన ఒకప్పటి హీరోయిన్స్ ఖుష్బూ,మీనా హీరోయిన్స్గా నటిస్తున్నారు. కీర్తి సురేష్ ముఖ్యపాత్రలో నటిస్తోంది. ఈ సినిమా తర్వాత రజినీకాంత్.. కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్లో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేయనున్నట్టు సమాచారం.

కమల్ హాసన్, రజినీకాంత్ (ఫైల్ ఫోటోస్)
70 ఏళ్ల వయసులో గ్యాప్ లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తున్న రజినీకాంత్.. ఆ తర్వాత రాజకీయాలపై ఫోకస్ పెట్టనున్నట్టు సమాచారం. ఇప్పటికే సినిమాల విషయంలో కలిసి పనిచేయబోతున్న కమల్ హాసన్, రజినీకాంత్.. రేపొద్దున రాజకీయంగా కలిసి పనిచేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
Published by:Kiran Kumar Thanjavur
First published:January 24, 2020, 16:05 IST