Sarkaru Vaari Paata - Mahesh Babu: మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత అందరు హీరోలు తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్ ఇస్తున్నారు. పైగా ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు ఉండనే ఉంది. ఆ రోజున సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ లోగా ఈ నెల 31న ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి ఫస్ట్ నోటిస్ అంటూ ఒక బిగ్ అప్డేట్ ఇవ్వనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ పోస్టర్లో చేతిలో బ్యాగుతో మహేష్ బాబు ఎక్కడికో వెళుతున్నట్టు ఉంది. ముందుగా ఈ సినిమాను యూఎస్లో అనుకున్నారు. కానీ దుబాయ్లో ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసారు.
ఆ తర్వాత రెండో షెడ్యూల్ను దుబాయ్తో పాటు గోవాలో చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా రెండో షెడ్యూల్ కూడా హైదరాబాద్లో ప్రారంభించారు. దీని కోసం ప్రత్యేకంగా ఓ సెట్ను కూడా ఏర్పాటు చేసారు.
Witness our SuperStar in never seen before avatar ??#SVPFirstNotice on July 31st ?#SarkaruVaariPaata
Super ? @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus @SVPTheFilm pic.twitter.com/MrSPF1tYNK
— SarkaruVaariPaata (@SVPTheFilm) July 29, 2021
#SVPFirstNotice on July 31st ?
⚡️ W W M ⚡️#SarkaruVaariPaata ?
Super ? @urstrulyMahesh pic.twitter.com/4dEY4OTdAW
— SarkaruVaariPaata (@SVPTheFilm) July 29, 2021
కరోనా సెకండ్ వేవ్ కారణంగా హైదరాబాద్లో వేసిన ప్రత్యేక సెట్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసారు. ఇంతలోనే సర్కారు వారి పాట టీమ్లో కొంత మందికి కరోనా పాజిటివ్ తేలడంతో ఈ సినిమా షూటింగ్ను అర్ధాంతరంగా నిలిపివేసారు. ఇక నెల 12 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక జూలై 31న ఈ సినిమా విడుదల తేదిని ప్రకటిస్తారా లేదా టీజర్ను విడుదల చేస్తారా లేదా అనేది చూడాలి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తోంది.
ఈ సినిమాలో మహేష్ బాబు బ్యాంక్ మేనేజర్గా పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు మహేష్ బాబు మరో పాత్రలో కూడా కనిపించనున్నట్టు సమాచారం. కీర్తి సురేష్ కూడా బ్యాంక్ ఉద్యోగి పాత్రలో నటించనున్నారు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా సోషల్ మెసేజ్తో వస్తోంది. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది.
వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హిందీ వర్సటైల్ యాక్టర్ విద్యా బాలన్ నటించనుందని సమాచారం.ఈ సినిమాను జీఎంబీ ప్రొడక్షన్స్, 14 రీల్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahesh Babu, Mythri Movie Makers, ParasuRam, Sarkaru Vaari Paata, Tollywood