news18-telugu
Updated: November 19, 2019, 7:08 PM IST
మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో మహేష్ బాబు.. ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు.తాజాగా ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్ను విడుదల తేదిని అఫీషియల్గా ప్రకటించారు.
మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో మహేష్ బాబు.. ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ఫస్ట్ టైమ్.. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయ్ శాంతి ఈ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం కర్నూలు జిల్లాలోని కొండా బురుజు సెట్ను రామోజీ ఫిల్మ్ సిటీలో రీ క్రియేట్ చేసారు.తాజాగా ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్ విడుదల తేదిని ఈనెల 22న సాయంత్రి 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ప్రస్తుతం ఈ చిత్రం షెడ్యూల్ కేరళలోని అంగామలై ఫారెస్ట్లో జరుగుతోంది. నవంబర్ 22 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. నవంబర్ 25 నుంచి హైదరాబాద్లో షెడ్యూల్ కంటిన్యూ అవుతుంది.ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరతో కలిసి మహేష్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు కెమెరా మెన్గా పనిచేస్తున్నారు.ఇక సంక్రాంతికి రిలీజైన మహేష్ బాబు సినిమాల్లో ఎక్కువ మటుకు బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ సొంతం చేసుకున్నాయి. అదే లెక్కన 2020 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మహేష్ బాబు హిట్టు అందుకొని సంక్రాంతి హీరోగా సరిలేరు నాకెవ్వరు అనిపించుకుంటాడా లేదా అనేది చూడాలి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 19, 2019, 6:09 PM IST