news18-telugu
Updated: May 26, 2020, 3:34 PM IST
సుజీత్, చిరంజీవి Photo : Twitter
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్యలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్లో ఉండగానే ఆయన మరో సినిమాకు ఓకే చెప్పారు. ఓ మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు చిరు. మలయాళంలో క్రితం ఏడాది వచ్చిన 'లూసిఫర్' సంచలన విజయాన్ని నమోదు చేసింది. మోహన్ లాల్ నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ అక్కడ మంచి విజయం సాధించి ఆయన కెరీర్లోని ఓ చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచింది. దాంతో ఈ సినిమాను చిరంజీవితో తెలుగులో రీమేక్ చేయాలనే ఉద్దేశంతో ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కులను చరణ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రభాస్తో భారీ సినిమా 'సాహో' తీసి తన సత్తా చాటుకున్న సుజీత్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. తెలుగు వర్షన్లో ఇక్కడ నెటీవిటికి తగ్గట్లు తగినన్ని మార్పులు చేస్తున్నాడట. అక్కడ మోహన్ లాల్ చేసిన పాత్ర తెలుగు వెర్షన్ లో చిరు చేస్తుండగా కథలో భారీ మార్పులే జరుగుతున్నాయట. చిరు ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని సుజీత్ తెలుగు వర్షన్ లో కీలక మార్పులు చేస్తున్నాడని సమాచారం. ఇక అందులో భాగంగానే లాక్ డౌన్ సమయంలో ప్రాజెక్ట్కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడట సుజీత్. తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఇందులో మార్పులు చేసాడని తెలుస్తుంది. ఏడాది చివరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లో మరో భారీ హిట్ అందుకోవడం ఖాయం అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఈ సినిమా ఆచార్య పూర్తైయాక సెట్స్ పైకి వెళ్లనుంది. కరోనా వల్ల లాక్ డౌన్ వల్ల షూటింగ్ వాయిదా వేసుకున్న ఆచార్య.. సినిమా మొదట దసరాకు అనుకున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే.. సంక్రాంతి కానుకగా విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం.
Published by:
Suresh Rachamalla
First published:
May 26, 2020, 3:34 PM IST