ప్రస్తుత పరిస్థితుల్లో ఎంటర్టైన్మెంట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడం.. దీనికి తోడు ఇంటర్నెట్ సేవలు కూడా అందరికి అనుకూల ధరల్లో ఉండడంతో ఇండియాలో డిజిటల్ మీడియా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందులో భాగంగా ఇండియాలో ప్రస్తుతం.. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లు చాలా ప్రాచుర్యం పొందాయి. అంతేకాదు.. ఈ సంస్థలు సొంతంగా కాంటెంట్ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. వాటినే మనం ఒరిజనల్స్గా పిలుస్తున్నాము. ఈ ఒరిజనల్స్లో హిందీలో కియారా నుండి రాధికా ఆప్టే వరకు వెబ్ సిరీస్లు చేస్తూ అటూ డిజిటల్లో ఇటూ సినిమాల్లో మంచి అవకాశాలు పొందుతున్నారు. తెలుగులో కూడా ఇలాంటీ కల్చర్ ఇప్పుడిప్పుడే వస్తోంది. అందులో భాగంగా తాజాగా ప్రఖ్యాత స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ తెలుగులో మొదటిసారిగా ఓ ఒరిజనల్ కంటెంట్ను ప్రోడ్యూస్ చేసింది. దీనికి సంబంధించిన టీజర్ను విడుదలచేసింది. పిట్టకథలు పేరుతో విడుదలైన ఈ టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఈ పిట్టకథలు అనే అంథాలజీలో మొత్తం నాలుగు కథలు ఉండనున్నాయి. ఈ కథలు కూడా ఉమెన్ మహిళలకు సంబంధించినవి ఉంటూ.. సమాజంలో ఉన్న పెట్రియార్కిను ప్రశ్నిస్తూ ఒక్కో కథలో ఒక్కో అంశాన్ని చర్చించనున్నారు.
ఇక తాజాగా విడుదలైన ఈ టీజర్లో శృతి హాసన్, అమలాపాల్, ఈషారెబ్బా, లక్షీమంచులు కనబడుతున్నారు. మరో ముఖ్య పాత్రను జగపతి బాబు పోషించాడు. అయితే విడుదలైన ఈ టీజర్లో పెద్దగా ఏమి చూపించలేదు. ఈ నాలుగు కథలు ఏయే అంశాలను చర్చించనున్నాయి అనేది త్వరలో తెలియనుంది. ఇక ఈ నాలుగు కథలను నలుగురు తెలుగు డైరెక్టర్స్ తరుణ్ భాస్కర్, సంకల్ఫ్ రెడ్డి, నందినీ రెడ్డి, అండ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు.
ఇక ఇప్పటికే తెలుగు హీరోయిన్స్ ఇలాంటీ వెబ్ సిరీస్లో నటిస్తోన్న సంగతి తెలసిందే. పాపులర్ తెలుగు నటి సమంత అమెజాన్ ప్రైమ్లో వస్తోన్న ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్లో కీలక పాత్రలో నటిస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్లో సమంత కనిపించనుంది. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా వెబ్సిరీస్లో నటిస్తోంది. తాజాగా సాయి పల్లవి కూడా ఓ తమిళ వెబ్ సిరీస్లో నటించిన సంగతి తెలిసిందే. పావ కథైగల్ అనే తమిళ అంథాలజీలో సాయి పల్లవి గర్భవతిగా నటించి అదరగొట్టింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్లో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది.
Published by:Suresh Rachamalla
First published:January 20, 2021, 12:51 IST