ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలిచినందుకు ఆ పార్టీ అధినేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి కంటే ఎక్కువ సంబరపడిపోతున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అంతేకాదు వైయస్ఆర్సీపీ గెలిచినప్పటి నుంచి తనదైన శైలిలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లను తనదైన శైలిలో సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నాడు. తాజాగా రామ్ గోపాల్ వర్మ..జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యాడు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నట్టు ఇది వరకే ట్విట్టర్లో ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటి వరకు పాలిటిక్స్కు దూరంగా ఉంటూ వచ్చిన వర్మ ఫస్ట్ టైమ్ ..జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.
For the first time ever I am attending a political event , the swearing in ceremony of @ysjagan as the new CM of Andhra Pradesh💐💐💐 ..Hoping to spot the Ex CM there 😍😍😍
— Ram Gopal Varma (@RGVzoomin) May 29, 2019
ఇప్పటికే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీతో చంద్రబాబు సహా టీడీపీని టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఇపుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడుగా మారాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి పట్టాభిషేక్ మహోత్సవంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఆయన్ని చూసి వైసీపీ శ్రేణుల సంతోషానికి అవధులు లేవు.
KAMMA Vijayawada Novotel Hotel moththam KADAPA Redla mayam #KammaRajyamLoKadapaRedlu pic.twitter.com/gsuCkoIWci
— Ram Gopal Varma (@RGVzoomin) May 30, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Ap election result 2019, Ram Gopal Varma, RGV, Ys jagan mohan reddy, Ysrcp