ప్రముఖ సినీ నటుడు, తెలుగు దేశం నేత మురళీమోహన్ వెన్నుపూసకు సంబంధించిన నొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. రీసెంట్గా మురళీ మోహన్ తల్లి వసుమతి దేవి అనారోగ్యంతో కన్నుమూయంతో ఆమె అస్థికలను గత నెల 14న కలిపేందుకు వారణాసి వెళ్లారు. ఈ సందర్భంగా మురళీ మోహన్..అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని హుటాహుటిన హైదరాబాద్కు తరలించారు. ఈ సందర్భంగా వెన్నుపూసకు సంబధించి ఆపరేషన్ చేయాలనడంతో గత నెల 24న మురళీ మోహన్కు కెేర్ హాస్పిటల్లో చికిత్స చేసారు. ఆపరేషన్ తర్వాత ఆయన ఇపుడిపుడే కోలుకుంటున్నారు. త కొంత కాలంగా ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అందుకే ఈసారి ఆయన బదులు ఆయన కోడలు రూప రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఆపరేషన్ పూర్తి చేసుకున్న మురళీ మోహన్కు చిరంజీవి దంపతులు పరామర్శించారు. అంతేకాదు ఆయన త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్ధించారు. ఈ సందర్భంగా మురళీ మోహన్ మట్లాడుతూ.. త్వరలోనే నేను కోలుకొని ప్రజలను అభిమానులను కలుస్తానని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Lok sabha election results, Lok Sabha Elections 2019, Murali Mohan, Tdp, Telugu Cinema, Tollywood