news18-telugu
Updated: May 18, 2020, 8:07 AM IST
రష్మిక మందన Photo : Instagram
Rashmika Mandanna : రష్మిక మందన.. 'ఛలో' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన 'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది. ఇటీవల మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించిన రష్మిక సూపర్ హిట్ అందుకుంది. ఆమె తాజాగా నితిన్తో భీష్మలో నటించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. అది అలా ఉంటే లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న రష్మిక తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. అయితే ఈ సందర్భంగా కొంచెం కొత్తగా ఉండాలనీ.. రొటీన్ ప్రశ్నలు అడగొద్దని చెబుతూ.. #UntoldRashmika ట్యాగ్ను జత చేసింది రష్మిక. దీంతో ఇదే అదునుగా భావించిన ఓ నెటిజన్ రష్మికను ప్రశ్నిస్తూ.. మీ చిన్నతనంలో జరిగిన సరదా ఘటన గురించి చెప్పమన్నాడు. ఇక ఆప్రశ్నకు రష్మిక సమాదానం ఇస్తూ.. ‘నేను, నా ఫ్రెండ్తో కలిసి ట్యూషన్కు వెళ్తుండగా ఓ చోట మామిడి చెట్టు కనిపించింది. ఇక ఆగలేక నేను చెట్టు ఎక్కి మామిడి కాయలు కోస్తున్న.. అయితే అక్కడే ఉన్న ఆ చెట్టు యజమాని (ఆంటీ) చూసి.. కర్రపట్టుకుని.. మమ్మల్ని తిడుతూ వెంబడించిందని చెబుతూ.. ఇలాంటీ ఘటనలు అందరికి జరిగేవే కదా.. అని పేర్కోంది.

Instagram
ఇక ‘మీరు థియేటర్లో చూసిన మొదటి సినిమా ఏది?’ అని మరో నెటిజన్ అడగగా.. ‘‘గిల్లి’ అని చెప్పింది. ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే ఆమె ఆచార్యలో చరణ్ సరసన మెరవనుంది. చిరంజీవి ప్రధాన పాత్రలో శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మాట్నీ ఎంటర్టైన్ మెంట్తో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మెసేజ్ ఓరియెంటెడ్గా వస్తోన్న ఈ చిత్రం.. భారీ బడ్జెట్తో నిర్మితమవుతోంది. ఈ సినిమాతో పాటు రష్మిక ప్రస్తుతం బన్ని సరసన పుష్పలో నటిస్తోంది. ఈ సినిమాను సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.
Published by:
Suresh Rachamalla
First published:
May 18, 2020, 8:00 AM IST