మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ‘ప్రతిరోజూ పండగే’. ఈ నెల 20న విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచే మంచి టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని మెగా హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా మెచ్చుకున్నారు.
మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ‘ప్రతిరోజూ పండగే’. ఈ నెల 20న విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచే మంచి టాక్ సొంతం చేసుకుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు నిర్మించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్గా నటించింది. సత్యరాజ్ కీలక పాత్రలో నటించాడు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టేనర్గా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకులతో పాటు సినీ నటులు అభినందిస్తున్నారు. తాజాగా రామ్ చరణ్. ఈ సినిమా చూసి ప్రతిరోజూ పండగే యూనిట్ను అభినందించాడు. కుటుంబ విలువల్ని ఎంతో హృద్యంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అందరు తప్పకుండా చూడాలన్నారు.
మరోవైపు మరో మెగా హీరో అల్లు అర్జున్ కూడా ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం చూసి మెచ్చుకున్నారు. ఈ చిత్రంతో నా కజిన్ సాయి ధరమ్ తేజ్ మంచి హిట్ అందుకున్నాడు. మరోవైపు నా మిత్రుడు మారుతి ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. మరోవైపు బన్నివాసు ఈ సినిమాతో మంచి హిట్టు అందుకున్నాడు. ఇంకోవైపు ఈ సినిమాతో మా నాన్న అల్లు అరవింద్కు, యూవీ క్రియేషన్స్ వాళ్లకు మంచి లాభాలొచ్చాయన్నారు.
Congratulations to the Entire team of Prathi Raju Pandage. So glad my cousin Sai Tej has a good hit , my friend Maruthi has a success, My Life Line Vasu has a good film in his account & My Father has more Profits . Congratulations to UV films. pic.twitter.com/erYDa3jVxs
‘ప్రతిరోజూ పండగే’ చిత్ర విషయానికొస్తే..సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే యూఎస్లో ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా దూసుకుపోతుంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.