తమిళ సూపర్ స్టార్ నటుడు రజనీకాంత్ వైద్య చికిత్స కోసం జూన్ 19న ప్రత్యేక అనుమతితో అమెరికా బయలుదేరిన సంగతి తెలిసిందే. ఆయన సాధారణ హెల్త్ చెక అప్ కోసం అమెరికా వెళ్లారు. రజనీకాంత్ 2016 మేలో అమెరికాలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయించుకున్నారు. ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చెక్ అప్ కోసం వెళ్తున్నారు. అందులో భాగంగానే ఆయన అమెరికా వెళ్లారు. అక్కడ మయో క్లినికల్ ఆస్పత్రిలో రజనీకాంత్కు వైద్యులు పలు రకాల పరీక్షలు చేశారు. అన్ని పరీక్షలలోను ఎలాంటి సమస్యలు లేవని తేలతడంతో రజనీకాంత్ తిరిగి ఈరోజు చెన్నైకి వచ్చారు. రజనీ శుక్రవారం చెన్నైకు వచ్చినట్టు తెలుస్తోంది. తమ అభిమాన నటుడు ఆరోగ్యంగా తిరిగి రావడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మరోవైపు రజనీకాంత్ తన కూతురు సౌందర్య డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది. ఇదే రజనీ చేసే చివరి సినిమా అవుతుందని అంటున్నారు. ఇక రజనీ ప్రస్తుతం శివ దర్శకత్వంలో రూపొందిన అన్నాత్తె చిత్రంలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది. ఈ చిత్రంలో రజనీతో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బు, సూరి, ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీ నటించాల్సిన సన్నివేశాల షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది.
ఇక అన్నాత్తే కంటే ముందు రజనీ దర్భార్ అంటూ వచ్చాడు. మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మధ్య సరైనా హిట్స్ లేక సతమతమవుతోన్న రజనీకాంత్కు ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని భావిస్తున్నారు ఆయన అభిమానులు. రజనీ ఈ ‘అన్నాత్తే’ కోసం కలం పట్టి సొంతంగా సంభాషణల రాయనున్నారట. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్నందని సమాచారం. ఈ సినిమాలో రజనీకాంత్ ఊరి పెద్దగా శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారట. తెలుగు టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.