యువ హీరో రాజ్ తరుణ్ ఉయ్యాలా జంపాల సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమాలో ఆయన నటన, డైలాగ్ తీరు ఆకట్టుకుంది. ఆ తర్వాత కూడా మంచి సినిమాలతో అలరించిన రాజ్ తరుణ్కు ఈ మధ్య ఏమి కలిసిరావడం లేదు. ఆయన సినిమాలు అనుకున్నంతగా అలరించలేకపోతున్నాయి. ఇటీవల దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన లవర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అది అలా ఉంటే ఆయన తాజా సినిమా ఒరేయ్ బుజ్జిగా.. మాళవిక హీరోయిన్గా చేసింది. ఈ సినిమాకు విజయ్కుమార్ కొండా దర్శకత్వం వహించాడు. విజయ్ కుమార్ గతంలో ‘‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ సినిమాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అది అలా ఉంటే ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సివుండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి సిద్ధమైంది చిత్రబృందం.
అందులో భాగంగా "ఒరేయ్ బుజ్జిగా" సినిమా రైట్స్ ను గంపగుత్తగా జీ గ్రూప్ దక్కించుకుంది. మొన్నటివరకు శాటిలైట్ రైట్స్ కోసం మాత్రమే చర్చలు జరిపింది. డిజిటల్ రైట్స్ ను "ఆహా" యాప్ దక్కించునే ప్రయత్నాలు చేసింది. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు.. మొత్తం అన్ని రైట్స్ను జీ గ్రూప్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ నెలాఖరుకు లేదా అక్టోబర్ మొదటివారంలో "ఒరేయ్ బుజ్జిగా" జీ5లో స్ట్రీమ్ కానుంది. అయితే ఈ డీల్ విలువ భారీగానే ఉంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఈ సినిమాను 13 కోట్ల రూపాయలకు జీ గ్రూప్ ఫైనల్ చేసినట్టు సమాచారం. ఈ ఆఫర్ రాజ్ తరుణ్ సినిమాకు ఈ చాలా పెద్దది అంటున్నారు సినీ పండితులు. ఆ విధంగా రాజ్ తరుణ్ బంపర్ ఆఫర్ కొట్టినట్లే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Raj tarun, Tollywood Movie News