సామాజిక మాధ్యమాలు మనషుల జీవన విధానాన్నే మార్చివేసాయి. సోషల్ మీడియా వల్ల ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. అదే దానికి బానిసతే.. లైఫ్లు కడతేరిపోతాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేస్బుక్, ట్విట్టర్ కంటే ముందు ఇపుడు టిక్టాక్ ఫుల్లు పాపులర్ అయిపోయింది. కొంత మంది టిక్టాక్కు బానిపై కాపురాలు కూల్చుకున్న వారున్నారు. తాజాగా సినీ నటి రాశిఖన్నా కూడా టిక్టాక్కు అడక్ట్ అయిపోయింది. ఆమె టిక్టాక్కు బానిస అయింది నిజ జీవితంలో కాదు.. సినిమాలో భాగంగా.. ప్రస్తుతం ఈ భామ.. మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా ‘ప్రతిరోజూ పండగే’ సినిమా చేస్తోంది. మారుతి తన సినిమాల్లో హీరోలకు ఏదో ఒక ప్రాబ్లెమ్తో బాధపడుతుంటాడు. అలాగే ఈ సినిమాలో హీరోకు కాకుండా హీరోయిన్కు టిక్ టాక్కు బానిస అయిన ఒక అమ్మాయి క్యారెక్టర్లో నటించబోతున్నట్టు మారుతి రాశిఖన్నా క్యారెక్టర్ను డిజైన్ చేసినట్టు సమాచారం. మరి టిక్టాక్కు బానిసైన అమ్మాయిగా రాశిఖన్నా ఏ లెవల్లో అదరగొడుతుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Maruthi, PratiRoju Pandaage, Raashi Khanna, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood