హోమ్ /వార్తలు /సినిమా /

Pramod Kumar: టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత, నటుడు కన్నుమూత..

Pramod Kumar: టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత, నటుడు కన్నుమూత..

టాలీవుడ్‌లో మరో విషాదం ప్రముఖ నిర్మాత కన్నుమూత (File/Photo)

టాలీవుడ్‌లో మరో విషాదం ప్రముఖ నిర్మాత కన్నుమూత (File/Photo)

Pramod Kumar Producer cum Actor:  చిత్రసీమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ పబ్లిసిటీ ఇంఛార్జ్ కమ్ నటుడు నిర్మాత ప్రమోద్ కుమార్ కన్నుమూసారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Pramod Kumar Producer cum Actor:  చిత్రసీమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. 2023లో జమున, విశ్వనాథ్, వాణీ జయరామ్, తారకరత్న,సతీష్ కౌశిక్  వంటి ప్రముఖులు కన్నుమూసిన విషయం మరిచిపోక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్‌లో పబ్లిసిటీ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించి నటుడిగా, నిర్మాతగా సత్తా చాటిన ప్రమోద్ కుమార్ అనారోగ్యంతో (21/3/2023)న   కన్నుమూసారు. ఆయన వయసు 87 ఏళ్లు. ప్రమోద్ కుమార్ టాలీవుడ్‌లో పబ్లిసిటీ డిజైనర్‌గా 38 ఏళ్లుగా పనిచేసారు. ఆయన పబ్లిసిటీ ఇంఛార్జ్‌గా పనిచేసిన 300 చిత్రాల్లో 50కి పైగా శతదినోత్సవాలు జరుపుకోవడం విశేషం. అటు నిర్మాతగా రెండు చిత్రాలను నిర్మించారు. మోహన్ బాబుతో ‘గరం మసాలా’, దొంగ పోలీస్’ చిత్రాలను నిర్మించారు. ఇక ఈయన ‘సుబ్బయ్య గారి మేడ’ చారిత్రక నవల రాశారు.

అంతేకాదు ఈయనలో మంచి రచయతగా కూడా ఉన్నాడు. ఈయన సినీ రంగంలో అనుభవాలను మేలవించి ‘తెర వెనక తెలుగు సినిమా’ పేరుతో గ్రంథస్థం చేవారు. ఈ సినిమా అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నంది పురస్కారానికి ఎంపికైంది.

ఈయన మృతిపై టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ మరణంపై పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా విచారం వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Mohan Babu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు