news18-telugu
Updated: March 30, 2020, 4:08 PM IST
మొన్నటి వరకు అభిమానులు మా వాడు సినిమాకు 40 కోట్లు తీసుకున్నారు.. 50 కోట్లు తీసుకున్నారు అంటూ హీరోలు గొప్పగా చెప్పుకునే వాళ్లు. ఎవరెన్ని తీసుకున్నా కూడా ఇండియాలో రజినీకాంత్ తర్వాతే ఎవరైనా.
మరోసారి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. తన పెద్ద మనసు చాటుకున్నాడు. అంతేకాదు ప్రభాస్ నిజంగానే మనసున్న మారాజు అంటూ ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో దేశంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికుల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కరోనా పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా బాధితుల సహాయార్థం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు చెరో 50 లక్షలు అనౌన్స్ చేసాడు. అంతేకాదు ప్రధాన మంత్రి సహాయ నిధికి కూడా రూ. 3 కోట్ల విరాళం అందించాడు ప్రభాస్.తాజాగా ప్రభాస్.. టాలీవుడ్ కార్మికుల సహాయార్ధం మరో రూ.50 లక్షల విరాళం ప్రకటించి మరోసారి పెద్ద మనసు చాటుకున్నాడు. మొత్తంగా ప్రభాస్.. కరోనా సహాయార్ధం రూ.4.5 కోట్లను విరాళం ప్రకటించారు. మరోవైపు ప్రభాస్కు చెందిన యూవీ క్రియేషన్స్ వాళ్లు కరోనా క్రైసిస్ ఛారిటీకి రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. మొత్తంగా తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలోనే ఎక్కువ విరాళం ఇచ్చిన హీరోగా ప్రభాస్ రికార్డులకు ఎక్కాడు. ఇక మన దేశంలోనే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఏ హీరోకు అందనంత ఎత్తులో రూ.25 కోట్ల విరాళాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి ప్రకటించి సంచలనం సృష్టించారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
March 30, 2020, 3:42 PM IST