Kiran Kumar ThanjavurKiran Kumar Thanjavur
|
news18-telugu
Updated: November 3, 2019, 5:49 PM IST
పవన్ కళ్యాణ్ (Instagram/Photo)
జనసేన అధినేతగా పూర్తిస్థాయి రాజకీయాల్లో వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేయనని ఖరాఖండిగా ఎన్నోసార్లు చెప్పాడు. ఒకేసారి సినిమాలు, రాజకీయాలనే రెండు పడవలపై ప్రయాణం తనవల్ల కాదన్నాడు. నీ మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. మళ్లీ ముఖానికి రంగేసుకొని మళ్లీ నటనపై దృష్టి కేంద్రీకరించాడు. ఏపీలో ఎలక్షన్స్కు మరో ఐదేళ్లు ఉండటంతో రాజకీయల్లో కొనసాగుతూనే.. ఈ లోగా ప్రజలను మేలుకొలుపే సినిమాలు చేయాలని పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే హిందీలో అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్రలో నటించిన ‘పింక్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమాను బోనీ కపూర్తో కలిసి దిల్ రాజు ప్రొడ్యూస్ చేయనున్నాడు. అంతేకాదు ఈ సినిమాను ఎంసీఏ ఫేమ్ శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేయనున్నాడు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

పవన్ కల్యాణ్ పింక్ రీమేక్
పవన్ కళ్యాణ్ ఈ సినిమాను కేవలం రెండు నెలల్లోనే కంప్లీట్ చేయనున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు రాయనున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.తాజాగా పవన్ కళ్యాణ్.. అపుడెపడో ఏ.ఎం.రత్నం నిర్మాణంలో తన స్వీయ దర్శకత్వంలో ‘సత్యాగ్రాహి’ సినిమాను అనౌన్స్ చేసాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు. అప్పట్లోనే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అన్ని సమకూర్చుకున్నాడు. తాజాగా ఈ సినిమా కథకు దుమ్ము దులిపి పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు పవన్.

పవన్ దర్శకత్వంలో ఆగిపోయిన ‘సత్యాగ్రాహి’ మూవీ (Facebook/Photo)
ఈ సినిమాను క్రిష్ చేతిలో పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ క్రిష్ కాకపోతే.. హరీష్ శంకర్ దర్శకత్వంలో సత్యాగ్రాహి సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ‘సత్యాగ్రాహి’ సినిమాతో సమకాలీన రాజకీయా అంశాలను ఎండగట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అందుకే రాజకీయాల్లోనే ఉంటూనే ఇదివరకటిలా మాస్ సినిమాలు కాకుండా.. జనాలను చైతన్య పరిచే సామాజిక సందేశం ఉన్న సినిమాలు చేయాలని పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయినట్టు సమాచారం.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 3, 2019, 5:49 PM IST