NTR Jr: ఎన్టీఆర్ ఆ టార్గెట్ను రీచ్ అవుతాడా.. ? తారక్ ఫ్యాన్స్లో ఉత్కంఠ నెలకొంది. వివరాల్లోకి వెళితే.. తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడిగా అడుగుపెట్టి తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అంతేకాదు ఇన్నేళ్ల కెరీర్లో సినిమాలే కాదు. బిగ్బాస్ వంటి రియాలిటీ షోను తెలుగు ప్రేక్షకులకు మొదటగా పరిచయం చేసింది ఎన్టీఆరే. ఈయన హోస్ట్గా ఈ షోను తనదైన శైలిలో సూపర్ హిట్ చేసాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉండటంతో ఈయన బిగ్బాస్ తర్వాత సీజన్స్కు హోస్ట్గా కంటిన్యూ చేయలేకపోయాడు. ఆ తర్వాత బిగ్బాస్ షోలో ఎన్టీఆర్ ప్లేస్లో సెకండ్ సీజన్ను నాని హోస్ట్ చేస్తే.. మూడో, నాల్గో సీజన్లను నాగార్జున హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా.
ఆ సంగతి పక్కన పెడితే... ఎన్టీఆర్ మరోసారి స్మాల్ స్క్రీన్ పై సందడి చేయడానికి రెడీ అయ్యాడు. నాగార్జున అప్పట్లో హోస్ట్ చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ తరహాలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే రియాలిటీ షోను హోస్ట్ చేయబోతున్నట్టు జెమినీ టీవీ అఫీషియల్గా ప్రకటించింది. ఇప్పటికే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ .. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోమోను రెడీ చేసాడు. త్వరలో ఈ ప్రోమోను విడుదల చేయనున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా ఈ ప్రోగ్రామ్తో సామాన్యులకు మరింత దగ్గరయ్యే అవకాశం తనకు దక్కడం ఎంతో అదృష్టమన్నారు. ఏప్రిల్ నెల లేదా మే నుంచి ఈ షో జెమిని టీవీలో టెలికాస్ట్ కానుంది. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్కు సంబంధించి ఆడిషన్స్ జరుగుతున్నాయి.
ఎవరు మీలో కోటీశ్వరులు(Jr NTR)
ఒక్కో ఎపిసోడ్ కోసం దాదాపు 1.2 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. సీజన్ 1 కోసం 30 ఎపిసోడ్స్ ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఈ సీజన్లోనే రూ. 30 కోట్లకు పైగా తారక్ పారితోషికంగా తీసుకోబోతున్నాడన్నమాట. ఐతే.. ఈ షో విషయంలో ఎన్టీఆర్ ముందు పెద్ద టార్గెట్ ఉంది. ఇప్పటి వరకు స్టార్ మా ఛానెల్లో ఇప్పటి వరకు నాలుగు సీజన్లు ప్రసారం అయ్యాయి. నాగార్జున హోస్ట్ చేసిన మూడు సీజన్లు సక్సెస్ అయితే.. చిరంజీవి చేసిన ఓ సీజన్ 4 పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ తర్వాత స్టార్ మా ఛానెల్ వాళ్లు ఈ ప్రోగ్రామ్ పై పెద్దగా ఆసక్తి ప్రదర్శించలేదు. దాంతో జెమిని టీవీ వాళ్లు ఎన్టీఆర్తో ఈ ప్రోగ్రామ్ను ప్లాన్ చేసారు. మరి ఎన్టీఆర్ తన యాంకరింగ్తో ఈ షోకు హైయ్యెస్ట్ టీఆర్పీ సాధించడంలో సక్సెస్ అవుతాడా ? లేదా అనేది చూడాలి.
ప్రస్తుతం తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్లో జెమిని టీవీ 4 ప్లేస్లో ఉంది. ఈ ఛానెల్లో సినిమాలు మినహా ఏ ప్రోగ్రామ్స్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఇప్పటికే నాగార్జున, చిరంజీవి ఈ షోను హోస్ట్ చేయడంతో ప్రేక్షకులు కూడా ఎన్టీఆర్ హోస్టింగ్ను ఆ ఇద్దరు హీరోలతో పోలుస్తారు. ఎన్టీఆర్ తన హోస్టింగ్తో నాగార్జున, చిరంజీవిని మైమరిపిస్తే కానీ ఈ షో సక్సెస్ కానట్టు. ఇక ఎన్టీఆర్ ఇప్పటికే బిగ్బాస్ హోస్ట్గా మెప్పించిన సంగతి తెలిసిందే కదా. దీంతో ఈ షోను రక్తి కట్టించడం తారక్ కు పెద్ద పని కాదంటున్నారు చాలా మంది. అంతేకాదు ఈ షో బిగ్బాస్ టీఆర్పీ ని కూడా క్రాస్ చేయాలి. మొత్తంగా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ రియాలిటీ షోతో ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తారనేది చూడాలి. మొత్తంగా ఆర్ఆర్ఆర్ కంటే ముందు తారక్ ముందు పెద్ద టార్గెట్ ఉందన్న మాట.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.