నితిన్.. ప్రస్తుతం వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. రంగ్ దే సినిమా తర్వాత నితిన్ హిందీలో మంచి విజయాన్ని అందుకున్న థ్రిల్లర్ మూవీ ‘అంధాధూన్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఆ మధ్య విడుదలూ ఫస్ట్ లుక్ కూడ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ను జరుపుకుంటోంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇంకొక వారం రోజుల షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. అది జరిగితే సినిమా షూటింగ్ మొత్తం పూర్తైనట్టేనట. ఆ పార్ట్ కరోనా ఉధృతి కాస్తా తగ్గాక తిరిగి మొదలుకానుంది. ఈ సినిమాను నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్పై ఎన్. సుధాకర్రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా నభా నటేష్ నటిస్తోంది. మరోకీలక పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించనుంది. ఈ సినిమాను జూన్ 11న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జూన్ 11న విడుదల కష్టమే. అది అలా ఉంటే నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆగష్టు నెలలో లాంచ్ చేయనున్నారట దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. వక్కంతం వంశీ మొదటి సినిమా ‘నా పేరు సూర్య’ చిత్రం అనుకున్నంతగా అలరించలేదు. ఆ సినిమా తర్వాత వంశీ డైరెక్ట్ చేయనున్న సినిమా ఇదే. మొదటి చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో వక్కంతం వంశీ కసిగా ఈ సినిమా కథను తయారు చేసుకున్నారట. లాంగ్ గ్యాప్ తీసుకుని పర్ఫెక్ట్ కథను సిద్ధం చేసుకుని నితిన్ తో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వనుందో..
కరోనా వల్ల లభించిన ఈ విరామ సమయంలో వక్కంతం వంశీ బౌండ్ స్ర్కిప్ట్ సిద్ధం చేశారట. 'ఠాగూర్' మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక నితిన్ ఇటీవల రంగ్ దే అనే ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వచ్చారు. ఈ సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ రంగ్ దేలో నితిన్ సరసన మొదటిసారి కీర్తి సురేష్ నటించింది. ఈ సినిమా మార్చి 26 ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పెద్దగా ఆకట్టకోలేకపోయింది. ఇక ఇటీవల నితిన్ హీరోగా వచ్చిన మరో సినిమా చెక్. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చంద్రశేఖర్ ఏలేటీ దర్శకత్వం వహించారు.
కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ పిరియాడిక్ ఫిల్మ్ చేయనున్నారు నితిన్. ఈ సినిమాకు పవర్ పేట అనే టైటిల్ ను పరిశీలిస్తోంది చిత్రబృందం. వెంకీ కుడుములతో కూడా నితిన్ మరో సినిమా చేయనున్నారని తెలిసింది. అంతేకాదు ఇప్పటికే నితిన్ కోసం పక్కా కమర్షియల్ స్క్రిప్ట్ కూడా రెడీ చేశారట వెంకీ. ఈ కథ నితిన్ కి కూడా బాగా నచ్చిందట. చూడాలి మరి వీరి సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో భీష్మ వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.