అక్కినేని నాగార్జున హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు( Nagarjuna and Praveen sattaru movie) దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కొంత కాలం షూటింగ్ జరుపుకుంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇక ఇటీవల కరోనా కేసులు తగ్గడంతో ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అది అలా ఉంటే ఈ చిత్రం నుంచి ఒక మాస్ అనౌన్సమెంట్, ప్రీ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ లుక్ ఆసక్తికరంగా ఉంది. వర్షంలో కత్తిని పట్టుకొని ఉన్న నాగ్ సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ లో ఉన్నట్టు అర్ధం అవుతుంది. ఇక నాగార్జున బర్త్ డే సందర్భంగా 29వ తారీఖున మరో సాలిడ్ అప్డేట్ ఉండనున్నట్టుగా తెలిపారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా (Kajal Aggerwal) నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ గోవాలో పూర్తైంది. రెండో షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతుంది. కథలో భాగంగా ఇండియాలోని ప్రధాన నగరాలు, విదేశాల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేసింది చిత్ర బృందం.
ఈ సినిమాలో నటుడు నాగార్జున కొత్తగా కనిపించనున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వైడ్ అప్పీల్ తీసుకురావడం కోసం ఇతర భాషలు నుండి నటీనటులను తీసుకుంటోందట చిత్రబృందం. అందులో భాగంగా ఈ సినిమాలో నాగ్ చెల్లెలిగా చంఢీఘర్ భామ, మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గుల్పనాగ్ నటిస్తున్నారు.
Here's the PRE LOOK of
?️ #KingNagsNext ?️
⭐ing KING @iamnagarjuna ?
A film by @PraveenSattaru ?
An exciting update coming your way on 29-08-21 ??@MsKajalAggarwal #NarayanDasNarang #RamMohanRao @AsianSuniel @sharrath_marar @SVCLLP @nseplofficial#HBDSunielNarang pic.twitter.com/g3X1bDO0Co
— BA Raju's Team (@baraju_SuperHit) August 27, 2021
ఇక ఆయన నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’కు సీక్వెల్గా బంగార్రాజు అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ‘సోగ్గాడే చిన్నినాయన’ 2015 లో విడుదలై మంచి విజయాన్ని అందించింది. ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా షూటింగ్ తాజాగా మొదలైంది. ఈ సీక్వెల్లో హిందీ నటి సోనాక్షి సిన్హా నటించనుందట. షూటింగ్ శరవేగంగా జరుపుకుని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుందట.
ఇక నాగార్జున నటిస్తోన్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ ఓ హిందీ సినిమాలోను నటిస్తున్నారు. ఈ సినిమాలో రణ్బీర్కపూర్, ఆలియా భట్ నటిస్తున్నారు. నాగార్జున ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్గా నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతో పాటు మనం సినిమాకు సీక్వెల్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nagarjuna Akkineni, Tollywood news