
నాగ చైతన్య, విక్రమ్, దిల్ రాజు Photo : Twitter
నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'దిల్' రాజు ఓ సినిమాను నిర్మిస్తున్నాడు.
Naga Chaitanya : నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే చాలా వరకు లవ్ స్టోరీ షూటింగ్ జరపుకుంది. కారోనా వల్ల ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అది అలా ఉంటే ఈ మధ్య కాలంలో నాగ చైతన్య కథల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నాడు. 'మజిలీ' తరువాత ఆయన కొత్తదనం గల కథలను మాత్రమే ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు. 'లవ్ స్టోరీ' తర్వాత మరో రెండు సినిమాలకు ప్లాన్ చేశాడు చైతూ.. అందులో భాగంగా ఆయన 'బంగార్రాజు' 'నాగేశ్వరరావ్' సినిమాల్లో నటించనున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'దిల్' రాజు నిర్మించనున్న ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. విక్రమ్ కుమార్ ఇటీవల నానితో 'గ్యాంగ్ లీడర్' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అంతేకాదు గతంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ 'మనం' సినిమా చేశాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విక్రమ్ దర్శకత్వంలో చైతన్య సోదరుడు అఖిల్ 'హలో' చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయింది. అయితే ఈ ఇద్దరీ కాంబినేషన్లో వచ్చే ఈ తాజా చిత్రానికి 'థ్యాంక్యూ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉండనుందని టాక్. కరోనా లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.
Published by:Suresh Rachamalla
First published:April 30, 2020, 13:19 IST