సినిమాల్లో నుండి రాజకీయాల్లో వెళ్లి అక్కడ తనకంటూ ఫైర్ అంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రోజా. ప్రస్తుతం పాలిటిక్స్తో పాటు జబర్ధస్త్ షో వంటి రియాలిటీ షోస్కు జడ్జ్గా వ్యవహరిస్తోంది రోజా. ప్రస్తుతం సినిమాలను పక్కన పెట్టి కేవలం రాజకీయాలపై దృష్టి సారిస్తూ.. జబర్ధస్త్ వంటి ప్రోగ్రామ్స్ మాత్రమే చేస్తోంది రోజా. ఇక తెలుగులో ‘శంభో శివ శంభో’, గోలీమార్’ సినిమాల తర్వాత సినిమాలపై అంతగా దృష్టి సారించలేదు. అంతేకాదు రోజా తనకు తగ్గ పవర్ఫుల్ రోల్ వస్తే కానీ చేయనని ఫిక్స్ అయింది. తాజాగా రోజాకు అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో విలన్ పాత్ర కోసం సంప్రదించినట్టు సమాచారం. ఈ సినిమా కథ మొత్తం నల్లమల, శేషాచలం ఫారెస్ట్ నేపథ్యంలో కొనసాగుతోంది. మరోవైపు రోజా కూడా చిత్తూరు జిల్లాకు చెందిన ఆమె కావడంతో ఈ పాత్రకు రోజా అయితే న్యాయం జరుగుతుందని దర్శకుడు సుకుమార్.. రోజాను కలిసి ఈ సినిమాలో ఆమె పాత్రకు సంబంధించి వివరాలు చెప్పినట్టు సమాచారం. ఇక రోజా కూడా ఈ కథ నచ్చి సుకుమార్కు ఓకే చెప్పినట్టు సమాచారం. అంతేకాదు ప్రస్తుతం రోజా.. రాజకీయాలతో పాటు రియాల్టీ షోలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం కేవలం పదిహేను రోజులు మాత్రమే డేట్స్ కేటాయిస్తాను. ఆ లోపే తన పాత్రకు సంబంధించిన షూట్ కంప్లీట్ చేయాలని కండిషన్స్ పెట్టినట్టు సమాచారం.
ఇక సుకుమార్ విషయానికొస్తే.. ఆయన పర్ఫెక్షెన్ కోసం ఎన్ని టేకులు తీసుకోవడానికైనా వెనకాడడు. అలాంటిది పుష్ప సినిమాలో రోజా పాత్రను 15 రోజుల్లో కంప్లీట్ ఎలా చేయాలో తెలియక కాస్త అయోమయంలో పడ్డట్టు సమాచారం. మొత్తానికి సుకుమార్ కూడా రోజా చెప్పిన కండిషన్స్కు ఒప్పుకొని ఆమె పాత్రను సాధ్యమైనంత మేర తక్కువ టైమ్లో చిత్రీకరంచేలా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం రోజాకు ఏపీలో సినిమా షూటింగ్స్కు సంబంధించిన ఓ కమిటీకి చైర్మన్గా ఏపీ సీఎం జగన్ నియమించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu Arjun, MLA Roja, Pushpa Movie, Sukumar, Tollywood