news18-telugu
Updated: November 9, 2020, 7:50 AM IST
కొరటాల శివ ఆచార్య (koratala siva acharya)
MegaStar Chiranjeevi Acharya Shooting Resume | చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో కథానాయికుడిగా కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటిస్తున్నాడు. ఐతే.. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ అన్ని సినిమాల్లోలాగే ఆగిపోయింది. ఇక కరోనా లాక్డౌన్ తర్వాత ఒక్కొక్క హీరో షూటింగ్ కోసం దిగుతున్నారు.. ఇప్పటికే నాగార్జున, వెంకటేష్, బాలయ్య వంటి సీనియర్లు షూటింగ్ కోసం రంగంలోకి దిగారు. అటు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ కోసం త్వరలో షూటింగ్లో జాయిన్ కానున్నారు. ఇక చిరంజీవి ‘ఆచార్య’ సినిమా షూటింగ్ ఈ రోజు కాసేపటి క్రితమే మొదలైంది.

‘ఆచార్య’ (Twitter/Photo)
ఈ రోజు షెడ్యూల్లో చిరంజీవి కాకుండా.. మిగతా సీన్స్ షూట్ చేయనున్నారు. చిరంజీవి వారం తర్వాత ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. అంతేకాదు ఈ సినిమాను నెలాఖరు వరకు లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసారు. ఆ తర్వాత కొన్ని సీన్స్ షూట్ చేస్తే.. ఈ సినిమా కంప్లీట్ అవుతోంది. మరోవైపు రామ్ చరణ్ ముందుగా ఆర్ఆర్ఆర్ కంటే ముందు ఆచార్య షూటింగ్లో పాల్గొననున్నాడు. కాజల్ కూడా వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కానుంది. ఈ సినిమా కోసం కాజల్ 20 రోజుల డేట్స్ కేటాయించింది. మరోవైపు ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రష్మిక నటిస్తోంది. అంతేకాదు వచ్చే యేడాది సమ్మర్లో విడుదల కానున్నట్టు ప్రకటించారు.

ఆచార్యలో చిరంజీవి (Twitter/Photo)
చిరంజీవి ఓ వైపు ఆచార్య సినిమా చేస్తూనే పలువురు దర్శకులు చెప్పిన కథలకు ఓకే చెప్పాడు.ఇప్పటికే చిరంజీవి... మలయాళ సూపర్ హిట్ ‘లూసీఫర్’ రీమేక్లో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పాడు. ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో ఒక యాక్షన్ స్టైలిష్ ఓరియంటెడ్ చేయడానికి ఓకే చెప్పాడు. ఈ సినిమాను తమిళంలో అజిత్ హీరోగా నటించిన ‘వేదాలం’ సినిమాకు రీమేక్. ఈ సినిమాను ఈ నెల 18న స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. ఆ తర్వాత ఇద్దరు దర్శకులు చెప్పిన కథలకు ఓకే చెప్పాడు. అయితే... ఆచార్య తర్వాత చిరంజీవి.. ఏ దర్శకుడితో నెక్ట్స్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకెళతాడా అనే సందిగ్ధం నెలకొని ఉండే. తాజాగా ఆ అనుమానాలకు తెరదించుతూ.. చిరంజీవి.. తన నెక్ట్స్ మూవీని తన కజిన్.. మెహర్ రమేష్ దర్శకత్వంలోనే చేయబోతున్నట్టు మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయినట్టు సమాచారం.

చిరంజీవి, మెహర్ రమేష్ (File/Photo)
చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో తెరకెక్కే ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కించే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందివ్వనున్నట్టు సమాచారం. ఇప్పటికే మహతి ఇచ్చిన ‘ఛలో’, ‘భీష్మ’ సినిమాలోని పాటలు ఎంతో పాపులర్ అయ్యాయి. అందుకే చిరంజీవి కూడా తన నెక్ట్స్ మూవీకి మహతిని సెలెక్ట్ చేసినట్టు సమాచారం. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో చెల్లెలు పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 9, 2020, 7:50 AM IST