news18-telugu
Updated: April 12, 2020, 8:19 AM IST
మహేష్ బాబు (Mahesh Babu) Photo : Twitter
సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ బాబు ఇంతవరకు ఏ సినిమాను ప్రకటించలేదు. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు గీత గోవిందంతో అదిరిపోయో హిట్ ఇచ్చిన పరుశురామ్ దర్శకత్వంలో నటిస్తున్నాడని.. ఈ సినిమా దాదాపు ఖారరైందని తెలుస్తోంది. ఇక కేవలం అధికారిక ప్రకటన మాత్రమే మిగిలివుంది. స్క్రిప్ట్ పనులు కూడా పూర్తిచేసుకున్న ఈ సినిమాలో మహేష్ సరసన ఎవరైతే బాగుంటారో అని హీరోయిన్స్ కోసం చిత్రబృందం వెతుకుతోంది. అందులో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె ‘సారా అలీ ఖాన్’ నటించబోతుందని ఓ వార్త హల్ చల్ చేయడం తెలిసిందే. అలాగే కీర్తి సురేష్ నటించబోతుందని, ఆ తరువాత కియారా అద్వానీ హీరోయిన్ గా తీసుకోబోతున్నారని ఇలా చాలా రూమర్స్ వచ్చాయి. అయితే ఇంతకీ సూపర్ స్టార్ పక్కన నటించే ఆ హీరోయిన్ గురించి మాత్రం క్లారిటీ లేదు. సారా, కీర్తి, కియారాలలో, మహేష్ పక్కన ఎవరు రొమాన్స్ చేయనున్నారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా వస్తోన్న సమాచారం మేరకు మహేష్ సరసన సారా అలీ ఖాన్ను ఎంపిక చేసే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఇక పరుశురామ్.. మహేష్ బాబు కోసం ఎమోషనల్ గా సాగే ఓ కమర్షియల్ ఎంటర్ టైనర్ ను సిద్ధంచేశాడట. ఇక కరోనా మహమ్మారి తగ్గి అన్ని కుదిరితే ఈ సినిమా అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రం గురించిన మరో ఆసక్తి వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ప్రధాన విలన్ గా కన్నడ హీరో ఉపేంద్ర నటిస్తున్నారట. ఉపేంద్ర ఈ సినిమాలో విలన్ పాత్రకు బాగుంటాడని దర్శకుడు భావిస్తున్నాడట. ఉపేంద్ర.. త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో విలన్గా అదరగొట్టిన సంగతి తెలిసిందే.
Published by:
Suresh Rachamalla
First published:
April 12, 2020, 8:18 AM IST