సర్కారు వారి పాట... సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ (Mahesh Babu)అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తన్నారు. పరుశురామ్ డైరెక్షన్లో మహేష్ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లో టాలీవుడ్లో అన్ని రికార్డులను మటాష్ చేసింది. ఈ సినిమా విడుదలకు మరో 8 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ సినిమా నుంచి విడుదల చేసిన సర్కారు వారి పాట ట్రైలర్ సోషల్ మీడియాలో నెంబర్ వన్ ట్రెండింగ్లో కొనసాగుతోంది. సర్కారు వారి పాట సినిమా ఈనెల 12న విడుదల కానుంది.
‘సర్కారు వారి పాట’(Sarkaru Vaari Paata) సినిమా యూఎస్లో ఎన్నడు లేనట్టుగా రికార్డు స్థాయిలో 603 లోకేషన్స్లో విడుదల కాబోతోంది. ప్యాన్ ఇండియా సినిమాలు తప్పించి తెలుగులో ఓ సినిమా ఈ రేంజ్లో ఇన్ని లోకేషన్స్లో విడుదల కావడం ఇదే ఫస్ట్ టైమ్. అయితే పొరుగు రాష్ట్రంలో కూడా ఈ సినిమా ప్రీమియర్స్ షో పడుతున్నట్లు తెలుస్తోంది. చెన్నైలో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో ప్రీమియర్స్ పడనున్నాయని సమాచారం అందుతోంది. చెన్నైలోని రోహిణి సిల్వర్ స్క్రీన్ థియేటర్ ఎంతో ఫేమస్ అనే సంగతి తెలిసిందే. కోలీవుడ్ పెద్ద హీరోల సినిమాలకు మాత్రమే ఈ థియేటర్ లో ఉదయం సమయంలో స్పెషల్ షోలను ప్రదర్శించడం జరుగుతుంది. అయితే సర్కారు వారి పాట తెలుగు వెర్షన్ ఈ థియేటర్ లో బెనిఫిట్ షో ప్రదర్శితం కానుందని సమాచారం అందుతోంది.
తెలుగు వెర్షన్ విషయంలో ఈ రికార్డును సొంతం చేసుకున్న తొలి తెలుగు సినిమా సర్కారు వారి పాట అని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో ఏ స్థాయిలో ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారో తమిళంలో కూడా ఈ సినిమాను అదే స్థాయిలో ప్రదర్శించనున్నారని సమాచారం . చెన్నైలోని మహేష్ బాబు అభిమానులకు ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. రోహిణి థియేటర్ 30 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న థియేటర్ కావడం గమనార్హం. నిర్మాతలు సైతం ఈ సినిమా ఫలితం విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇక మహేష్ బాబు సర్కారు వారి పాటకు పాజిటివ్ టాక్ వస్తే పరశురామ్(Parasuram) కు కూడా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు దక్కనుంది.
మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. గీతా గోవిందం సక్సెస్ వల్ల పరశురామ్ కు ఈ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కింది. కొత్త తరహా కథనంతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. సర్కారు వారి పాట కరోనాను దాటుకుని ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ కానుంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా సకాలంలో షూటింగ్ ను పూర్తి చేసుకోకపోవడంతో మే నెల 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి నుంచి కళావతి అనే సాంగ్ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు ఈ సినిమా యూట్యూబ్లో 150 మిలియన్ పైగా వ్యూస్ రాబట్టి దూసుకుపోతోంది. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు. థమన్ (Thaman) సంగీతం అందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai, Kollyood News, Mahesh Babu, ParasuRam, Sarkaru Vaari Paata