హోమ్ /వార్తలు /సినిమా /

న్యాయం గెలిచింది.. నిర్భయ దోషుల ఉరిపై మహేష్ ట్వీట్..

న్యాయం గెలిచింది.. నిర్భయ దోషుల ఉరిపై మహేష్ ట్వీట్..

నిర్భయ దోషుల ఉరిపై మహేష్ బాబు ట్వీట్ (Mahesh tweet on nirbhaya)

నిర్భయ దోషుల ఉరిపై మహేష్ బాబు ట్వీట్ (Mahesh tweet on nirbhaya)

Mahesh Babu: నిర్భయ దోషులను ఉరి తీయడంపై సూపర్ స్టార్ తనదైన శైలిలో స్పందించాడు. చాలా ఏళ్లుగా వేచి చూస్తున్న న్యాయం ఇప్పటికీ జరిగింది.

నిర్భయ దోషుల ఉరిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ కేసులో న్యాయం కాస్త ఆలస్యంగా గెలిచింది కానీ చివరికి గెలిచింది న్యాయమే అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా మంది సెలబ్రిటీస్ తమ మనసులో మాట చెప్పారు. తాజాగా మహేష్ బాబు కూడా ఇదే విషయంపై ట్వీట్ చేసాడు. నిర్భయ దోషులను ఉరి తీయడంపై సూపర్ స్టార్ తనదైన శైలిలో స్పందించాడు. చాలా ఏళ్లుగా వేచి చూస్తున్న న్యాయం ఇప్పటికీ జరిగింది. నిర్భయ కేసులో జరిగిన తీరుతో మరోసారి న్యాయ వ్యవస్థపై అందరికీ నమ్మకం వచ్చిందని ట్వీట్ చేసాడు సూపర్ స్టార్.

న్యాయం కోసం రేయింబవళ్లు పోరాడిన నిర్భయ తల్లిదండ్రులకు సెల్యూట్ చేసాడు మహేష్ బాబు. మన న్యాయ వ్యవస్థను అంతా గౌరవించాలని కోరుకున్నాడు సూపర్ స్టార్. ఇప్పటికీ కొన్ని దారుణాలు జరిగినపుడు వెంటనే అమలయ్యే శిక్షలు ఉండేలా న్యాయ వ్యవస్థలో మార్పులు చేయాలేమో అంటున్నాడు మహేష్. ఏదేమైనా కూడా న్యాయం గెలిచినందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. ప్రస్తుతం ఈయన పరుశురామ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం త్వరలోనే మొదలు కానుంది. ప్రస్తుతం కుటుంబంతో పాటు ఎంజాయ్ చేస్తున్నాడు సూపర్ స్టార్.

First published:

Tags: Mahesh babu, Nirbhaya case, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు