హోమ్ /వార్తలు /సినిమా /

Maha Samudram : సెన్సార్ పూర్తి చేసుకున్న మహా సముద్రం.. అక్టోబర్ 14న గ్రాండ్ రిలీజ్..

Maha Samudram : సెన్సార్ పూర్తి చేసుకున్న మహా సముద్రం.. అక్టోబర్ 14న గ్రాండ్ రిలీజ్..

Maha Samudram censor Completed Photo : Twitter

Maha Samudram censor Completed Photo : Twitter

Prabhas | Maha Samudram : ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి (Ajay bhupathi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా యాక్షన్ డ్రామా‘మహా సముద్రం’  (Maha Samudram). ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా (Sharwanand) (Siddharth) నటిస్తున్నారు. అక్టోబర్ 14న విడుదలకానున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది.

ఇంకా చదవండి ...

ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి (Ajay bhupathi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మహా సముద్రం’  (Maha Samudram). లవ్ అండ్ యాక్షన్ జానర్‌లో వస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా (Sharwanand) (Siddharth) నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా డబ్బింగ్ పనులను కూడా పూర్తి చేసుకుంది. మహా సముద్రం ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల దగ్గరపడుతుండడంతో ఈ చిత్రం తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి, ఈ చిత్రాన్ని అక్టోబర్ 14 వ తేదీన ప్రేక్షకులను అలరించడానికి థియేటర్ల లోకి తీసుకు వస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్ మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా ట్రైలర్‌లో యూట్యూబ్‌లో అదరగొడుతోంది.

ఇక ఈ ట్రైలర్‌ను చూసిన ప్రభాస్ తాజాగా మహా సముద్రం టీమ్‌ను మెచ్చుకున్నారు. చిత్ర ట్రైలర్ బాగుందని... చాలా ఇంటెన్స్‌గా ఉందని.. తన సోషల్ మీడియాలో పేర్కోన్నారు.ట్రైలర్‌లో ముఖ్యంగా కొన్ని డైలాగ్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. సముద్రం చాలా గొప్పది మామ. తనలో చాలా రహస్యలు దాచుకుంటుంది. నవ్వుతూ కనిపించనంత మాత్రానా బాగున్నట్టు కాదు అర్జున్ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగులు, మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా అంటూ సిద్ధార్థ్ చెప్పే మాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి.

మహా సముద్రంలో హీరో శర్వానంద్.. సిద్ధార్థ్ కలిసి నటిస్తున్నారు. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీని ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నారు. ఇందులో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాతో తమిళ నటుడు సిద్ధార్థ్ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఒకప్పుడు తెలుగులో మంచి పాపులారిటీ దక్కించుకున్న సిద్ధార్థ్ ప్రస్తుతం తెలుగులో సినిమాలు ఏవీ చేయడం లేదు. దాదాపు ఏడేళ్ళ గ్యాప్ తరువాత మళ్లీ ‘మహా సముద్రం’ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన తెలుగులో నటించిన బొమ్మరిల్లు, ఆట, నువ్వొస్తానంటే నేనొద్దంటానా మొదలగు చిత్రాలతో సూపర్ క్రేజీ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 19న విడుదల కావాల్సి ఉంది. కరోనా పరిస్థితుల్లో విడుదల వాయిదా పడింది. కాగా ఈ మధ్య కరోనా కేసులు తగ్గడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమాల విడుదలకు అనుమతి ఇవ్వడంతో ఇప్పటికే పలు సినిమాలు విడుదలైయ్యాయి. ఈ నేపథ్యంలో మహా సముద్రం దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అయితే ఇప్పటికే దసరా బరిలో అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, నాగ శౌర్య వరుడు కావలెను సినిమాలు కూడా ఉన్నాయి.

ఈ సినిమా డిజిటల్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది. దాదాపు పదకొండు కోట్లకు కొన్నట్లు నెట్ ఫిక్ల్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకుందని సమాచారం. థియేటర్ రన్ పూర్తైన 50 రోజులకు ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చగా.. జగపతిబాబు, రావు రమేష్, గరుడ రామ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. శర్వానంద్, సిద్ధార్థ్‌ల సరసన అదితీ రావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ (Aditi Rao Hydari), (Anu Emmanuel)నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

First published:

Tags: Maha Samudram, Sharwanand, Tollywood news

ఉత్తమ కథలు