మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా కోసం మోహన్ బాబు ఫ్లాప్ సినిమాను ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. చిరంజీవితో కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ రీసెంట్గా ఒక పాటతో ప్రారంభమైంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తుంది. ‘స్టాలిన్’ తర్వాత చాలా ఏళ్లకు మరోసారి త్రిషతో చిరంజీవి జత కట్టాడు. తెలుగులో రాజమౌళి తర్వాత అపజయం అంటూ ఎరగని దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు కొరటాల శివ. సందేశాత్మక చిత్రాలకు కమర్షియల్ హంగులు అద్దడం కొరటాల శివ స్పెషాలిటీ. ఈ చిత్రాన్ని కొరటాల శివ దేవాదాయ శాఖ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. . దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇందులో చిరంజీవి.. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు ‘గోవిందాచార్య’ అనే పేరును పరిశీలిస్తున్నాడు. ఈ టైటిల్తో పాటు ‘గోవిందా హరి గోవిందా’ అనే పేరును కూడా పరిశీలిస్తున్నారు.
ఈ చిత్రంలో ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ అత్యంత కీలకం అని చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న కథకు ఇరవై ఏళ్ల క్రితం నాటి స్టోరీ ఈ చిత్రంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్లో ప్రస్తావించనున్నారు. అందులో చిరంజీవిని చూపిస్తే.. అంతగా మ్యాచ్ కాదు. అందుకే యంగ్ చిరు పాత్రను రామ్ చరణ్తో చేయించాలనే ఆలోచనలో కొరటాల శివ ఉన్నట్టు చెబుతున్నారు. ఇక తన పాత్రలో నటించడానికి చిరు.. రామ్ చరణ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
ఈ మధ్యనే మోహన్ బాబు హీరోగా నటించిన ‘గాయత్రి’ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో యంగ్ మోహన్ బాబు క్యారెక్టర్లో మంచు విష్ణు నటించాడు. అదే తరహాలో ఇపుడు చిరంజీవి యంగ్ పాత్రలో ఆయన కుమారుడు రామ్ చరణ్ నటించబోతున్నట్టు దాదాపు ఖరారైంద. ఈ విషయమై త్వరలోనే అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.