news18-telugu
Updated: August 9, 2019, 11:51 AM IST
Photo : Instagram.com/kiaraaliaadvani
Kiara Advani : కియారా అద్వానీ... ఇటీవలే ‘కబీర్ సింగ్’ చిత్రంతో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ భామ చేసింది కొన్ని సినిమాలే అయినా స్టార్ హీరోయిన్గా క్రెడిట్ కొట్టేసి క్రేజీ హీరోయిన్గా మారింది. ఇప్పుడు ఏకంగా విజయ్కు జోడీగా తమిళ చిత్ర సీమలో అడుగు పెట్టనుంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఆమెకు తమిళ స్టార్ హీరో విజయ్ సరసన అవకాశం దక్కిందని తెలుస్తోంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయనున్నారు. దీనికి ‘తలపతి 64’ అనే వర్కింగ్ టైటిల్ను పెట్టారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూర్చుతున్నారు. అయితే మొదట్లో విజయ్కి జోడీగా రష్మిక, సినీయర్ హీరోయిన్ త్రిష పేర్లు వినిపించాయి. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు.. వారినీ కాదని కియారాను ఎంచుకుంది చిత్ర బృందం. కారణం.. 'కబీర్ సింగ్ 'లో తన నటనతో కట్టిపడేసిన కీయరా.. ఇటూ బోల్డ్ క్యారెక్టర్స్ చేయడం, సీన్లో జీవించి నటించడం ఆమె లోని బెస్ట్ క్వాలిటీ అని.. చెబుతూ కియారా అద్వానీని హీరోయిన్గా ఎంచుకున్నట్లు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.
View this post on Instagram
🍭
A post shared by KIARA (@kiaraaliaadvani) on
ఇదే జరిగితే కియారాకు జాక్పాట్ తగిలినట్లే. ఒక వేళ విజయ్తో నటిస్తున్న 'తలపతి 64' సినిమా హిట్ అయ్యిందంటే ఉత్తరాది, దక్షిణాది స్టార్ హీరోయిన్గా కీర్తించబడే లక్కీ ఛాన్స్ కియారా సొంతమవుతుంది. ఇక ఇటీవలే బాలీవుడ్ లో 'కబీర్ సింగ్' రూపంలో భారీ హిట్ సొంతం చేసుకుని హిందీలో బిజీ అయిపోయింది. ప్రస్తుతం హిందీలో కియారా 'గుడ్ న్యూస్', 'లక్ష్మీ బాంబ్' సినిమాలతో బిజీగా ఉంది.
Published by:
Suresh Rachamalla
First published:
August 9, 2019, 11:37 AM IST