news18-telugu
Updated: May 26, 2020, 10:32 AM IST
కాజల్ అగర్వాల్: తేజ తెరకెక్కించిన సీత సినిమాలో చివరి వరకు కూడా కాజల్ విలన్ పాత్రలోనే నటించింది. ఆ తర్వాత చివరి నిమిషంలో మంచిదానిలా మారిపోతుంది.
కాజల్ అగర్వాల్.. ఈ అందాల మెరుపుతీగను తెలుగుతెరకు తేజ పరిచయం చేసినా.. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'చందమామ' సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది. ఇక అప్పటినుండి దాదాపు ఓ దశాబ్దం కాలంగా తన అందచందాలతో పాటు ఎవరిని నొప్పించని మనసుతో అలరిస్తూనే ఉంది. స్టార్ హీరోయిన్గా కూడా గుర్తింపు పొందిన కాజల్ ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అటూ తమిళ్, హిందీ సినిమాలు చేస్తోంది. అయితే కేరిర్ మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైన కొంత కుదురుకున్న తర్వాత నటనకు ప్రాధాన్యమున్న సినిమాలతో అభిమానుల్ని సంపాదించుకుంది. కాజల్ ప్రస్తుతం కమల్ హాసన్ భారతీయుడు 2లో నటిస్తోంది. దీంతో పాటు చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో వస్తోన్న ఆచార్యలో కూడ అలరించనుంది. కాగా కరోనా నేపథ్యంలో ప్రస్తుతం సినిమాల షూటింగ్స్ అన్ని బంద్ అయ్యాయి. దీంతో ఇంట్లోనే ఉంటున్న కాజల్.. తాజాగా మాట్లాడుతూ.. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఒత్తిడికి గురి కాలేదని చెబుతోంది. ఈ భామ మాట్లాడుతూ.. ఎలాంటి కష్టాలొచ్చినా ఒత్తిడికి లోనవను. సావధానంగా ఆలోచిస్తాను. ఇప్పుడు కూడా అంతే.. ఈ లాక్ డౌన్ లో ఏమాత్రం ఒత్తిడి పడడం లేదు. ఆన్ లైన్లో కొత్త కోర్సులు నేర్చుకుంటున్నాను.. ఇష్టమైన బుక్స్ చదువుకుంటున్నాను.. అప్పుడప్పుడు వంట చేస్తున్నాను. ఇలా బిజీగా వుంటే ఒత్తిడి అన్నదే రాదని పేర్కోంది.
Published by:
Suresh Rachamalla
First published:
May 26, 2020, 10:32 AM IST