‘జెర్సీ’ సినిమాతో కన్నడ భామ శ్రద్ద శ్రీనాథ్ అన్నివర్గాల ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో ఈమెకు మొదటి సినిమానే మంచి బ్రేక్ తెచ్చిపెట్టింది. గ్లామర్, రొమాన్స్ తో పాటు ఒక సగటు ఇల్లాలు వంటి ఏ పాత్రలోనైనా తాను ఒదిగిపోగలనని కేవలం ఈ ఒక్క సినిమాతోనే ప్రూవ్ చేసుకుంది శ్రద్ద శ్రీనాథ్. తాజాగా ఈ భామ 'నేర్కొండ పార్వాయ్' అనే సినిమాలో నటించింది. అజిత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న యువతి పాత్రలో నటించింది శ్రద్ద శ్రీనాథ్. ఈ సినిమా హిందీలో తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమాకు రీమేక్. తాజాగా శ్రద్ధా శ్రీనాథ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... సమాజంలో మహిళలపై జరిగే నేరాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు.

శ్రద్ధా శ్రీనాథ్ (Instagram/photo)
మహిళలపై జరిగే లైంగిక నేరాల గురించి ఇప్పటికీ సమాజంలో సరైన అవగాహన లేదన్నారు. కేవలం అత్యాచారాన్ని మాత్రమే నేరంగా పరిగణిస్తున్నారని, తప్పుడు ఉద్దేశ్యంతో స్త్రీని సంప్రదించడం కూడా లైంగిక నేరమే. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మహిళలు పోలీస్ స్టేషన్ వెళ్ల ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు. తల్లిదండ్రులు, సమాజం వీటిని ఎలా స్వీకరిస్తారో అని భయం వాళ్లలో ఉంది ? కోర్టుల్లో ఈ కేసులు ఆలస్యం అవుతాయనే కారణంతో చాలా మంది వెళ్లడం లేదన్నారు శ్రద్ద. లైంగిక వేధింపులు జరిగినపుడు ఆ వ్యక్తి ఎక్కడ తాకాడు, ఎలా తాకాడు అనే ప్రశ్నలు అడగటం మానేయాలన్నారు. అలా అడగటం వల్ల బాధితులు ఇబ్బంది పడతారంది. ఇలాంటి విషయాల్లో సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. కానీ వారిపై ఉండే ఆలోచన విధానంలో మార్పు రావడం లేదు' అని శ్రద్ధా శ్రీనాథ్ చెప్పుకొచ్చారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:August 31, 2019, 19:17 IST