Jamuna | తెలుగు సినీ ఇండస్ట్రీ తొలి తరం కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి జమున. ఈ రోజు ఉదయం తన స్వగృహంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే కదా. ఈమె మృతిపై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె వయసు 86 యేళ్లు. ఈమె మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేసారు. మాజీ ఎంపీగా సినీ, రాజకీయ ాల్లో తన వంతు ప్రజా సేవ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళం, కన్నడలో నటించిన విసయాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా జమున కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.
అటు ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి కూడా జమున మృతిపై తన సంతాపాన్ని తెలియజేసారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి తరం నటీమణుల్లో అగ్ర కథానాయికగా వెలుగొంది తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న జమున గారి మృతి చెందడం బాధాకారం. ఆవిడ మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అన్నారు. ఈ సందర్భంగా జమున గారి కుటంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొదటితరం నటీమణులలో అగ్రకథానాయకిగా వెలుగొంది తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న జమున గారు మృతి చెందడం బాధాకరం. ఆవిడ మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. జమున గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/nDePyrPGri
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 27, 2023
ప్రముఖ సినీ నటి, ఫిలింఫేర్ అవార్డు గ్రహీత, మాజీ ఎంపీ శ్రీమతి జమున మృతి పట్ల సీఎం శ్రీ కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు. తొలితరం నటిగా వందలాది చిత్రాల్లో నటించి, తెలుగువారి అభిమాన తారగా వెలుగొందిన జమున జ్ఞాపకాలను సీఎం స్మరించుకున్నారు. pic.twitter.com/xnLhxnWOke
— Telangana CMO (@TelanganaCMO) January 27, 2023
తెలుగు, తమిళం, కన్నడంలోనే కాకుండా హిందీ సినిమాలలోనూ నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన జమున, నటిగా కళాసేవనే కాకుండా పార్లమెంటు సభ్యురాలిగా ప్రజాసేవ చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా జమున కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
— Telangana CMO (@TelanganaCMO) January 27, 2023
జమున మృతిపై బాలకృష్ణ స్పందిస్తూ.. ''అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు జమున గారు. చిన్ననాటి నుంచే నాటకాలలో అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారు. 195 పైగా సినిమాలలో నటించి నవరస నటనా సామర్ధ్యం కనబరిచారు జమున గారు. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రసంశలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమున గారు. నాన్నగారు అన్నట్లుగా కళకు కళాకారులకు మరణం ఉండదు. ఈ రోజున జమున గారు భౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ వారి మధుర స్మృతులు ఎల్లప్పుడూ మన మదిలో మెదులుతూనే ఉంటాయి. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను'' అని అన్నారు.అటు చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖులు జమున మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1936 ఆగస్టు 30న కర్ణాటక హంపీలో జన్మించారు జమున. తనదైన నటనతో వెండితెర సత్యభామగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, CM KCR, Jamuna, Telangana