దీపావళి సందర్భంగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీపావళి పండగ రోజున తన సినీ జీవితాన్ని సరికొత్తగా పునఃప్రారంభిస్తున్నాంటూ ట్వీట్ పెట్టారు. కొంతకాలంగా మంచు మనోజ్ కుటుంబపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవలే తన భార్యకు విడాకులు కూడా ఇచ్చానని తెలిపాడు. రెండేళ్ల తమ అందమైన బంధానికి ముగింపు పలికామని.. తమ మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయని తన అభిమానులతో పంచుకున్నాడు. వాటి వల్ల చాలా నొప్పిని కూడా అనుభవించామని తెలియజేసాడు మనోజ్. ఇద్దరం విడిపోవడానికి నిశ్చయించుకొనే విడాకులు తీసుకున్నామన్నాడు. దీనిపై తన అభిమానులకు సోషల్ మీడియా వేదికగా ఒక లెటర్ కూడా పోస్టు చేశాడు.
భార్యకు విడాకులు తర్వాత కాస్త రిలీఫ్ గా ఫీలైన మనోజ్ ఇకపై తన ఆనందాన్ని సినిమా రంగంలోనే వెతుక్కుంటానని అభిమానులకు తెలిపాడు. అయితే ఈసారి నిర్మాతగా మారుతున్నట్లు మంచు మనోజ్ ఆసక్తి చూపించాడు. దీపావళి సందర్భంగా తన పేరు కలిసొచ్చేలా ఎంఎం ఆర్ట్స్ బ్యానర్ స్థాపించాడు. బ్యానర్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశాడు. తన సొంత బ్యానర్ ద్వారా కొత్త ప్రతిభను పరిచయం చేస్తానని తెలిపాడు. రానున్న రోజుల్లో మంచి సినిమాలు తన బ్యానర్ నుంచి వస్తాయన్నాడు మంచు మనోజ్.
On this festival occasion, i am happy to announce that i have started my production house "MM Arts" and here are the details. Need all ur love and blessings for this new journey of mine ❤️#HappyDiwali everyone 😍#MMArts pic.twitter.com/chRL9sYCwH
— MM*🙏🏻❤️ (@HeroManoj1) October 27, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Manchu Family, Manchu Manoj, Tollywood, Tollywood Movie News, Tollywood news