తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన చిత్రాలున్నాయి. అందులో వైజయంతి మూవీస్ బ్యానర్లో సి.అశ్వనీదత్ నిర్మాతగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్గా నటించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా అప్పటి వరకు ఉన్న అన్నిరికార్డులను తిరగ రాసింది.ఈ సినిమా మే 9వ తేదితో 30 యేళ్లు కంప్లీట్ చేసుకోబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మూడు తెలియని విషయాలను అభిమానులతో పంచుకోనున్నట్టు నిర్మాత అశ్వినీదత్ ట్విట్టర్లో తెలిపారు. అందులో మొదటి స్టోరీని నాని వాయిస్ ఓవర్తో విడుదల చేసారు. బ్లాక్ బస్టర్లు ఎన్నో వస్తాయి. కానీ తరాలు మారినా.. ఎవర్ గ్రీన్ ఉండే బ్లాక్ బస్టర్ సినిమా లిస్టులో ఉండే మొదటి సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఓ సినిమాను చూసే విధానాన్ని మార్చిన ఈ చిత్ర కథ ఎలా పుట్టింది అనే దానిపై నాని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అశ్వినీదత్ కి ఎప్పటి నుంచో ఎన్టీఆర్ ‘జగదేకవీరుని కథ’ లాంటి ఫాంటసీ కథ చిరంజీవితో చేయాలనే కోరిక ఉండేదట. అది కూడా తను ఎంతో ప్రేమగా బావ అని పిలిచే రాఘవేంద్రరావు మాత్రమే తీయగలరనే గట్టి నమ్మకం ఉండేదట.
నాగార్జున, శ్రీదేవిలతో ‘ఆఖరి పోరాటం’ తర్వాత చిరంజీవితో సినిమాలకున్నారు అశ్వినదత్. ఈ సందర్భంగా దత్తుకు క్లోజ్ ఫ్రెండ్ అయిన కో డైరెక్టర్ శ్రీనివాస చక్రవర్తిని, రాఘవేంద్రరావుతో కలిపి తిరుపతికి పంపారు. సరిగ్గా తిరుమల కొండపై ఉండగా అశ్వినీదత్ మనసు తెలిసిన శ్రీనివాస చక్రవర్తి దేవకన్య భూమిపైకి వచ్చినపుడు ఆమె ఉంగరం పోగుట్టుకుంటుంది. అది హీరోకు దొరుకుతుంది. అని కొంచెం ఊహాజనితంగా ఈ కథ ముఖ్యపాయింట్ను చెప్పారు. అది రాఘవేంద్రరావుకు నచ్చింది.ఈ స్టోరీని అశ్వినీదత్ విని ఓకే చేసారు. ఆ తర్వాత మరి జగదేక వీరుడికి జోడిగా అతిలోకసుందరి ఎవరు ? అందరి మదిలో శ్రీదేవి పేరు వినిపించింది. ఆమె అప్పటికే వైజయంతి మూవీస్ బ్యానర్లో తెరకెక్కిన చాలా చిత్రాల్లో కథానాయికగా నటించింది.
ఈ కథకు ఒక రూపం ఇవ్వడానికి రాఘవేంద్రరావు వైజయంతీ మూవీస్కు సంబంధించిన ఆఫీసులో అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న టాప్ రచయతలను కథా చర్చల్లో పాల్గొనేలా చేసారు.జంధ్యాల, యండమూరి వీరేంద్రనాథ్, సత్యమూర్తి, విజయంద్ర ప్రసాద్, క్రేజీ మోహన్ వంటి చాలా మంది రచయతలు కలిసి ఈ సినిమా కథకు ఓ రూపం తీసుకొచ్చారు. వారితో కలిసి చిరంజీవి కూడా కథా చర్చల్లో పాల్గొన్నారు. ఇక దేవకన్యగా అతిలోకసుందరి చూపిస్తున్నపుడు నేను కొంచెం మాసిన గడ్డంతో ఉంటే బాగుంటుంది కదా అనే సలహా కూడా ఇచ్చారట. దీంతో నార్మల్ ప్రేక్షకులు కథతో కనెక్ట్ అవుతారని చెప్పుకొచ్చారు.
మరోవైపు శ్రీదేవి ఈ సినిమాలో తన కాస్ట్యూమ్స్కు తానే కుట్టించుకోవడం మొదలపెట్టారట. అలా అందరూ కలిసి ఈ చందమామ కథకు అందమైన రూపు ఇచ్చారు. అలా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఈ చిత్రం క్లాసిక్గా నిలిచిపోయింది. చరిత్రను సృష్టించిన ఈ సినిమా కథ అంతా ఈజీగా అయిపోయిందనుకుంటున్నారా ? లేదు మానవా.. చాలా స్టోరీ చాలా మిగిలే ఉంది. ఈ కథ వెనక ఉన్న రెండో స్టోరీని 7వ తేదిని సినీ ప్రేక్షకులకు ముందుకు రానుందని చెప్పుకొచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aswani Dutt, Chiranjeevi, Ilaiyaraaja, K. Raghavendra Rao, Nani, Sridevi, Tollywood