Chiranjeevi - Waltair Veerayya: ఈ యేడాది ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ సినిమాల తర్వాత చిరంజీవి (Chiranjeevi) తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) అనే టైటిల్ను ఖరారు చేశారు. ఇక ఇటీవల దీపావళీ సందర్భంగా విడుదలైన టైటిల్ టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకానున్నట్లు ప్రకటించింది టీమ్. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ను ఈ రోజు సాయంత్రి 4.05 నిమిషాలకు ప్రకటించనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘బాస్’ సాంగ్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలో హిందీ హీరోయిన్ ఊర్వశీ రౌటేలాతో చిరు చిందేసారు.
ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమాలో బాస్ పార్టీ (Boss Party) అంటూ తొలి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలో చిరంజీవి లుంగీలో ఊర మాస్ గెటప్లో ఓ రేంజ్లో ఉన్నాడు. అభిమానులు ఈ కటౌట్ చూసి ఫిదా అవుతున్నారు.
After a blockbuster #BossParty, it's time for a MASS PARTY in theatres ????#WaltairVeerayya Release Date Announcement Today at 4.05 PM ????
Megastar @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @konavenkat99 @SonyMusicSouth pic.twitter.com/oGmUk42di6 — Mythri Movie Makers (@MythriOfficial) December 7, 2022
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా మంచి అంచనాల నడుమ అక్టోబర్ 5, 2022న థియేటర్లలో గ్రాండ్ రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హిందీ నటుడు సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో పాత్రలో నటించిన పెద్ద ఒరిగిందేమి లేదు. మలయాళంలో లాగా పెద్దగా ఇంపాక్ట్ లేదు. ఇక వాల్తేరు వీరయ్య విషయానికి వస్తే.. ఇప్పటికే శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. మరో కీలకపాత్రలో సీనియర్ హీరోయిన్ సుమలత కనిపించనున్నారట. చిరంజీవి డ్యుయల్ రోల్లో కనిపించనున్నారట. అందులో భాగంగానే శృతిహాసన్తో పాటు సుమలత నటించనున్నారని అంటున్నారు.
ఇక ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగనుంది. సంక్రాంతికి ఇప్పటికే తెలుగులో బాలయ్య 107, వీరసింహారెడ్డి కూడా వస్తోంది. ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అటు విజయ్ వారసుడు సినిమా కూడా అదే రోజు విడుదల కానుంది. మరి చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాను ఏ డేట్లో విడుదల చేస్తారనేది చూడాలి. అయితే ఇక్కడ మరో విషయం ఏమంటే.. చిరంజీవి 154, బాలయ్య 107లను నిర్మించేది ఒకే సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. దీంతో ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. చూడాలి మరి ఏం జరుగనుందో.. ఇక చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Tollywood, Waltair Veerayya