CHIRANJEEVI LEAKS A DIALOGUE FROM PAWAN KALYAN BHAVADEEYUDU BHAGAT SINGH GOES VIRAL SR
Chiranjeevi | Acharya : షూటింగ్ మొదలే కాలేదు.. అప్పుడే భవదీయుడు నుంచి డైలాగ్ లీక్ చేసిన చిరంజీవి..
Chiranjeevi and Pawan Kalyan Photo : Twitter
Chiranjeevi | Acharya : ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ చిరంజీవితో ఓ ఇంటర్యూ చేశారు. ఆ ఇంటర్వూలో హరీష్ తన తదుపరి సినిమా భవదీయుడు నుంచి ఓ డైలాగ్ వదిలారు. ప్రస్తుతం ఆ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాలేదు అప్పుడే ఓ మంచి డైలాగ్ వైరల్ అవ్వడానికి చిరంజీవి కారణమట.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ఆచార్య (Acharya). ఈ సినిమా మంచి అంచనాల నడుమ ఏప్రిల్ 29న అంటే రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ (Ram Charan) మరో కీలకపాత్రలో నటించారు. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం వహించారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ ముగ్గురిని ఇంటర్యూ చేశారు. ఆ ఇంటర్వూలో హరీష్ (Harish Shankar) తన తదుపరి సినిమా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భవదీయుడు భగత్ సింగ్ నుంచి ఓ డైలాగ్ వదిలారు. ప్రస్తుతం ఆ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాలేదు అప్పుడే ఓ మంచి డైలాగ్ వైరల్ అవ్వడానికి చిరంజీవి కారణమని తెలుస్తోంది. ఇక ఆ డైలాగ్ విషయానికి వస్తే.. “మొన్న వీడు మన ఇంటికి వచ్చి అరిస్తే.. ఏంటీ వీడి ధైర్యం అనుకున్నా.. ఇప్పుడు అర్థమైంది. వీడు నడిస్తే వీడి వెనుక లక్షమంది నడుస్తారు. ఇదే వీడి ధైర్యం అనుకుంటా ” అని విలన్ చెప్పుతారట.. అయితే అక్కడే ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రం.. ” కాదు.. ఆ లక్షలాది మందికి వీడు ముందున్నాడు అనే ధైర్యం ” అని అంటారట. ఇక ఇదే డైలాగ్ను చిరంజీవి తనదైన శైలీలో మరోసారి చెప్పి వావ్ అనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన డైలాగ్ సోషల్ మీడియాలో రౌండ్స్ చేస్తోంది. ఇక ఆచార్య విషయానికి వస్తే.. టాలీవుడ్ లోనే మోస్ట్ వ్యూడ్ ట్రైలర్ ఆచార్య రికార్డు క్రికెట్ చేసింది. 24 గంటల్లో 24 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ట్రైలర్ను పూర్తిగా పవర్ ఫుల్ డైలాగ్స్ తో, యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపారు. రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి లు ఇద్దరూ కలిసి నటించిన చిత్రం కావడం, ఇద్దరినీ కూడా మాస్ అండ్ పవర్ఫుల్ గా చూపించడంతో మెగా ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఆధ్యాత్మికంకు నక్సలిజాన్ని మిక్స్ చేసి కొరటాల శివ సరికొత్తగా ఆచార్య సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan) సిద్దు పాత్ర దాదాపు గంట పాటు ఉండనుందట. ఆ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) జోడిగా నటించగా.. ఆమె పాత్రను తొలగించారట. రామ్ చరణ్కు జోడిగా పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు.
ఇక ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్టు సమాచారం.ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon prime) భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ డీల్కు సంబంధించిన అన్ని అగ్నిమెంట్స్ కూడా పూర్తైయినట్టు సమాచారం. ‘ఆచార్య’ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ‘ఆచార్య’ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్తో ఆడిపాడింది. ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో రెండు సినిమాలను చేస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ (God father) అనే పేరును ఖరారు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకానుందని సమాచారం. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు.
— Bhavadeeyudu Bhagat Singh (@BBSthefilm) April 27, 2022
ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా చేస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటు బాబీ, వెంకీ కుడుముల దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయనున్నారు చిరంజీవి. ఇక మరోవైపు చిరంజీవి తాజాగా మరో సినిమాకు ఓకే అన్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా దాదాపుగా ఖరారు అయ్యిందని అంటున్నారు. మలయాళంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోలుగా నటించిన ‘బ్రో డాడీ’ (Bro Daddy) సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారని టాక్. మలయాళంలో తండ్రీ కొడుకులుగా మోహన్ లాల్ (Mohan Lal), పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran) పాత్రలను తెలుగులో చిరంజీవి, సాయి ధరమ్ (Sai Dharam Tej) తేజ్ కలిసి చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిరంజీవి. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.