హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi : ఇది అత్యంత విషాదకరమైన రోజు.. కె.విశ్వనాథ్ మృతి పట్ల చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి..

Chiranjeevi : ఇది అత్యంత విషాదకరమైన రోజు.. కె.విశ్వనాథ్ మృతి పట్ల చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి..

Chiranjeevi with K Vishwanath Photo : Twitter

Chiranjeevi with K Vishwanath Photo : Twitter

K Viswanath passes away : ప్రముఖ సినీదర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ మరణ వార్త విని టాలీవుడ్ శోక సంద్రంలో మునిగింది. ఆయన మృతి పట్ల అటు రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు ప్రగాడ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. చిరంజీవి స్పందిస్తూ.. ఇది అత్యంత విషాదకరమైన రోజు.. ఆయన కుటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియచేసుకుంటున్నాను అంటూ ఏమోషనల్ అయ్యారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ (K Viswanath passes away) నిన్న రాత్రి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన శివైక్యం చెందారు. విశ్వనాథ్ వయసు 92 ఏళ్లు. ఆయన  గత కొంత కాలంగా వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలో బాధపడుతున్నారు. గురువారం కూడా తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ  తుదిశ్వాస విడిచారు. విశ్వనాథ్ మృతి పట్లు ఇటు రాజకీయ నాయకులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు తమ ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఘన నివాళులు అర్పిస్తూ.. విశ్వానాథ్ కుటుంబానికి ప్రగాడ సంతాపాన్ని ప్రకటించారు. ఇక తాజాగా నటుడు చిరంజీవి, విశ్వానాథ్ మృతి పట్ల స్పందిస్తూ.. తాను తీవ్ర దిగ్బ్రాంతికి గురైయానని.. భావోద్వేగపూరితమైన ఓ నోట్‌ను తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్‌లో పంచుకున్నారు.

“ఇది అత్యంత విషాదకరమైన రోజు. పితృ సమానులు, కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన గొప్పతనం గురించి చెప్పటానికి మాటలు చాలవు. పండితులని పామరులనీ కూడా ఒకేలా మురిపించే ఆయన చిత్రాల శైలి విశిష్టమైంది. ఆయనలా సున్నితమైన ఆర్ట్ ఫిలిమ్స్ ని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా మలిచిన దర్శకుడు బహుశా ఇంకొకరు లేరు. తెలుగు జాతి ఖ్యాతి ని తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి తీసికెళ్ళిన మహా దర్శకుడు ఆయన. ఆయన దర్శకత్వంలో ‘శుభలేఖ, ‘స్వయంకృషి, ‘ఆపద్బాంధవుడు’ అనే మూడు చిత్రాల్లో నటించే అవకాశం నాకు లభించింది. నాకు వ్యక్తిగతంగా ఆయనతో వున్నది గురు శిష్యుల సంబంధం. అంతకు మించి తండ్రీ కొడుకుల అనుబంధం. ఆయనతో గడిపిన సమయం నాకు అత్యంత విలువైనది. ప్రతి నటుడికీ ఆయనతో పని చేయటం ఒక ఎడ్యుకేషన్ లాంటిది. ఆయన చిత్రాలు భావి దర్శకులకి ఒక గైడ్ లాంటివి.

43 సంవత్సరాల క్రితం, ఆ మహనీయుడి ఐకానిక్ చిత్రం ‘శంకరాభరణం’ విడుదలైన రోజునే బహుశా ఆ శంకరుడికి ఆభరణంగా, ఆయన కైలాసానికి ఏతెంచారు. ఆయన చిత్రాలు, ఆయన చిత్రాల సంగీతం, ఆయన కీర్తి అజరామరమైనవి. ఆయన లేని లోటు భారతీయ చిత్ర పరిశ్రమకి, తెలుగు వారికి ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ ఆయన కుటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియచేసుకుంటున్నాను.” అంటూ ఏమోషనల్ అయ్యారు. చిరంజీవితో పాటు రాజమౌళి , రవితేజ బాలకృష్ణ, నాని, ఎన్టీఆర్ , కమల్ హాసన్, దర్శకులు బాబీ, గోపీచంద్, నటి అనసూయ మొదలగు సినీ ప్రముఖులు తమ ప్రగాడ సంతాపాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

విశ్వనాథ్ సినీ కెరీర్ విషయానికి వస్తే.. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆత్మ గౌరవం సినిమాతో దర్శకుడిగా మారారు. శంకరాభరణం సినిమా తెలుగు చిత్రసీమలో చరిత్ర సృష్టించింది. జాతీయ పురస్కారం గెలుచుకుంది. సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం ఆయకు కీర్తి ప్రతిష్ఠతలు తెచ్చిపెట్టాయి. సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ.. ఆయన తీసిన సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం అందరినీ ఆలోజింపజేశాయి.

విశ్వనాథ్ పూర్తిపేరు.. కాశీనాథుని విశ్వనాథ్. 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లెలో ఆయన జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్‌ చదివారు. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక.. వాహిని స్టూడియోస్‌లో సౌండ్‌ ఆర్టిస్టుగా సినీ కెరీర్‌ను మొదలుపెట్టారు. సినిమాల్లో ఆయన ప్రతిభను గుర్తించిన నాగేశ్వరరావు.. ఆత్మగౌరవం సినిమాలో దర్శకుడిగా అవకాశం కల్పించారు. ఆ తర్వాత సిరిసిరి మువ్వ సినిమాతో దర్శకుడిగా ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. విశ్వానాథ్ దర్శకుడిగానే కాదు.. నటుడిగానూ తెలుగు సినీ అభిమానులను అలరించారు. అనేక సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. శుభసంకల్పం, నరసింహనాయుడు, కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, ఠాగూర్, అతడు, ఆంధ్రుడు, మిస్టర్ పర్‌ఫెక్ట్ వంటి హిట్ సినిమాల్లో విశ్వనాథ్ నటించి అదరహో అనిపించారు. సినిమారంగంలో చేసిన కృషికి గాను... 2016 లో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. 1992 లో రఘుపతి వెంకయ్య పురస్కారంతో పాటు పద్మశ్రీ అవార్డును ఆయన అందుకున్నారు.

First published:

Tags: Chiranjeevi, Tollywood news

ఉత్తమ కథలు