CHIRANJEEVI BOBBY FILM UPDATE SHRUTI HAASAN FINALIZED AS A LEAD ACTRESS HERE ARE THE DETAILS SR
Chiranjeevi : చిరంజీవి సరసన శృతి హాసన్.. అధికారిక ప్రకటన..
Shruti Haasan Chiranjeevi Photo : Twitter
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi )ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తూనే.. ఆయన మరో మూడు చిత్రాల్లో నటిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi )ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తూనే.. ఆయన మరో మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. (Acharya) ఆచార్య ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అంత అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా మే 13న విడుదలకావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాతో పాటు చిరంజీవి బాబీ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి మరో ఖతర్నాక్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రముఖ నటి శృతి హాసన్ (Shruti Haasan) నటించనుందని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. వరల్డ్ విమెన్స్ డే సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించడం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. శృతి ప్రస్తుతం ప్రభాస్ సరసన 'సలార్' చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు బాలకృష్ణ గోపీచంద్ సినిమాలోను హీరోయిన్గా చేస్తున్నారు. ఇక ఈ సినిమా మంచి మాస్ మసాలా కథతో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు 'వాల్తేరు వాసు' అనే టైటిల్ను ఖరారు చేసినట్లు టాక్. దేవిశ్రీ ప్రసాద్ సంగతీం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
ఇక కొరటాల శివ ఆచార్య విషయానికి వస్తే.. చిరంజీవితో పాటు రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan) పాత్ర దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉండనుందట. ఆ పాత్ర సినిమాకు హైలెట్గా ఉంటుందట. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్తో ఆడిపాడారు. ఆచార్యలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggerwal) నటిస్తున్నారు. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే (PooJa Hegde) నటిస్తున్నారు. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 8, 2022
ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మలయాళీ హిట్ సినిమా లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్ చేస్తున్నారు. ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ రీమేక్ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ ( S. S Thaman) పనిచేస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ స్టార్ బిజు మీనన్ (Biju Menon) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహెర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా (Tamannaah) చేస్తున్నారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.