Chiranjeevi | Ram Charan | Acharya : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ), రామ్ చరణ్లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటిస్తున్న సినిమా ‘ఆచార్య’ (Acharya ). కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వం వహిస్తున్నారు. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదలకానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ఆచార్య టీమ్ ప్రమోషన్స్ను ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఈ సినిమా నుంచి మరో సాంగ్కు సంబంధించిన ప్రోమోను వదిలింది టీమ్. భలే భలే బంజారా సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేయగా.. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. శంకర్ మహాదేవన్, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. చిరంజీవి, రామ్ చరణ్లు ఇద్దరూ ఈ పాటలో కలిసి డాన్స్ ఇరగదీశారని తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి పాట 18న సాయంత్రం 4 గంటలకు విడుదలకానుంది. ఇక ప్రిరిలీజ్ ఈవెంట్ విషయానికి వస్తే.. (Acharya Prerelease Event) మొదట విజయవాడలో నిర్వహించాలనీ భావించారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ వస్తున్నట్లు టాక్ నడిచింది. అయితే ఏమైందో ఏమో ప్రిరిలీజ్ ఈవెంట్ వేదిక మారింది. ఈ కార్యక్రమాన్ని యూసఫ్ గూడలో ఏప్రిల్ 23న నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. హైదరాబాద్లో జరిగే ప్రిరిలీజ్ ఈవెంట్కు (Acharya Prerelease Event) పవన్ కళ్యాణ్తో (Pawan Kalyan) పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) కూడా హాజరు కానున్నారని టాక్ నడుస్తోంది.
ఇక ప్రమోషన్లో భాగంగా ఏప్రిల్ 12న ఈ సినిమాకు సంబంధించిన (Acharya Trailer) ట్రైలర్ను విడుదల చేసింది. ఈట్రైలర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ను దక్కించుకుంది. అంతేకాదు టాలీవుడ్ లోనే మోస్ట్ వ్యూడ్ ట్రైలర్ ఆచార్య రికార్డు క్రికెట్ చేసింది. 24 గంటల్లో 24 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ట్రైలర్ను పూర్తిగా పవర్ ఫుల్ డైలాగ్స్ తో, యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపారు. రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి లు ఇద్దరూ కలిసి నటించిన చిత్రం కావడం, ఇద్దరినీ కూడా మాస్ అండ్ పవర్ఫుల్ గా చూపించడంతో మెగా ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. దివ్య వనం ఒకవైపు.. తీర్ధ జలం ఒకవైపు.. నడుమ పాద ఘట్టం అంటూ రామ్ చరణ్ వాయిస్తో ఈ సినిమా ట్రైలర్ ఓపెన్ చేసారు. ఇక్కడుండే ప్రజలు పూజలు పునస్కారాలు చేస్తూ .. కష్టాలు వచ్చినపుడు అమ్మోరు తల్లిపై భారం వేసి బిక్కు బిక్కు మంటూ ఉంటామని భ్రమ పడి ఉండవచ్చు. ఆపద వస్తే ఆ అమ్మోరు తల్లే మమ్మల్ని ఆవహించి మమ్మల్ని ముందుకు పంపుతుంది అంటూ బ్యాక్ గ్రౌండ్లో రామ్ చరణ్ ధర్మస్థలి ఎలా అధర్మస్థలి ఎలా అవుతుంది. ఈ ట్రైలర్లో ఫస్ట్ హాఫ్ మొత్తం రామ్ చరణ్ పై ఉండగా.. మిగతాది చిరంజీవిపై ఉంది. ఆధ్యాత్మికంకు నక్సలిజాన్ని మిక్స్ చేసి కొరటాల శివ సరికొత్తగా ఆచార్య సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది.
Siruthaa Pululaa Sindaata 🕺🕺🔥
▶️ https://t.co/WSpGTCYth0#BhaleBhaleBanjara song out tomorrow at 4:05 PM 💥💥#AcharyaOnApr29 pic.twitter.com/UoY1XmlYo3
— Konidela Pro Company (@KonidelaPro) April 17, 2022
ఇక ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan) సిద్దు పాత్ర దాదాపు గంట పాటు ఉండనుందట. ఆ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) జోడిగా నటించగా.. రామ్ చరణ్కు జోడిగా పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. మరోవైపు ఈ సినిమా నిడివి 3 గంటలకి పైగా వచ్చిందట. దీంతో మూడు గంటల నిడివి బాగుంటుందా.. లేక బోర్ అనిపిస్తుందా.. అనే విషయంలో హీరో చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ తర్జనభర్జనలు పడుతున్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఓ ముప్పై నిమిషాల పాటు నిడివిని తగ్గిస్తే.. ఎలా ఉంటుందా అనే విషయంలో ఇద్దరి మధ్య చర్చ సాగుతోందట. అయితే ఈ (Acharya ) విషయంలో త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.
Ram Pothineni | The Warrior : తమిళ స్టార్ హీరో సాయం తీసుకుంటున్న రామ్ పోతినేని.. పిక్స్ వైరల్..
ఇక ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్టు సమాచారం.ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon prime) భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ డీల్కు సంబంధించిన అన్ని అగ్నిమెంట్స్ కూడా పూర్తైయినట్టు సమాచారం. ‘ఆచార్య’ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ‘ఆచార్య’ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్తో ఆడిపాడింది. ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో రెండు సినిమాలను చేస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ (God father) అనే పేరును ఖరారు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకానుందని సమాచారం. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా చేస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటు బాబీ, వెంకీ కుడుముల దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయనున్నారు చిరంజీవి.
ఇక మరోవైపు చిరంజీవి తాజాగా మరో సినిమాకు ఓకే అన్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా దాదాపుగా ఖరారు అయ్యిందని అంటున్నారు. మలయాళంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోలుగా నటించిన ‘బ్రో డాడీ’ (Bro Daddy) సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారని టాక్. మలయాళంలో తండ్రీ కొడుకులుగా మోహన్ లాల్ (Mohan Lal), పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran) పాత్రలను తెలుగులో చిరంజీవి, సాయి ధరమ్ (Sai Dharam Tej) తేజ్ కలిసి చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిరంజీవి. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Acharya, Chiranjeevi, Ram Charan, Tollywood news